ఈ మధ్య సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన మంచు విష్ణు మళ్ళీ వరసగా సినిమాలని ప్రకటిస్తున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా మోసగాళ్ళు సినిమా ని నిర్మిస్తూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మంచు విష్ణు కి సోదరిగా నటిస్తుండటం విశేషం. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమా మిగతా భాషల్లో డబ్బింగ్ చేయబోతున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టితో పాటు హీరోయిన్ రుహానీ సింగ్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాని మంచు మనోజ్ 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మిస్తుండగా హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ తెరకెక్కిస్తున్నాడు. 2020 సమ్మర్ లో ఈ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. కాగా తాజాగా మరో అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చాడు. గతంలో మంచు విష్ణు .. సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా భారీ హిట్స్ ఇచ్చిన శ్రీను వైట్ల దర్శకత్వంలో ఢీ అన్న కామెడీ ఎంటర్టైనర్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విష్ణు కి భారీ సక్సస్ ని ఇచ్చింది. చెప్పాలంటే విష్ణు టాప్ టెన్ సినిమాలలో ఢీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందని చెప్పొచ్చు.
అయితే ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ని రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోందట. కాగా ఈ నెల 23 న విష్ణు బర్త్ డే సందర్భంగా ఢీ సీక్వెల్ ని ప్రకటించి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు స్వయంగా విష్ణు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇక ఢీలో హీరోయిన్ గా జెనీలియా నటించింది. మరి ఈ సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్నది సినిమాని ప్రకటించినప్పుడు వెల్లడయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!