ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించి తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్న దర్శకుడు మణిరత్నం. అద్భుతమైన చిత్రాలని తెరకెక్కించిన ఈ దర్శకుడు తాజాగా ‘పొన్నియిన్ సెల్వన్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కల్కి రాసిన నవల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో కరోనా వచ్చి అడ్దుపడింది. ఇదొక్కటే కాదు ఈ చిత్రం అనుకున్నప్పటి నుండి రకరకాల కారణాలతో మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్’ ఆలస్యమవుతు వస్తున్న సంగతి తెలిసిందే.
కాగా మణిరత్నం కెరీయర్లో ఒక మూవీ కోసం ఇన్నేళ్ల పాటు ఇంత ఓపిగ్గా వేచి చూడడం అన్నది ఇదే మొదటి సారి అని చెప్పాలి. ఇక భారీ తారాగణంతో ప్లాన్ చేసిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కార్తీ, జయం రవి, త్రిష, జయరామ్, ఆధీ, విక్రమ్ ప్రభు, ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటించనున్నారు. అంతేకాదు ఐశ్వర్యారాయ్ ఇందులో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయనున్నారట. కాగా మణిరత్నం తెరకెక్కించిన పలు చిత్రాల్లో ఐశ్వర్యారాయ్ నటించింది.
అందుకే మణిరత్నం విలన్ పాత్ర ఆఫర్ చేసినా ఐశ్వర్యరాయ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి టాప్ టెక్నీషియన్లతో, భారీ తారాగణంతో పాన్ ఇండియా కేటగిరిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని అడ్డంకుల్ని అధిగమించి చిత్రీకరణను వేగంగా పూర్తి చేయాలని మణిరత్నం వేచి చూస్తున్నారు. అదీగాక ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక మణిరత్నం కే కాదు ప్రస్తుతం అందరి కలగా మారిందట. సో వీలైనంత త్వరగా ఈ మూవీ చిత్రీకరణ పూర్తి కావాలని అభిమానులు ఆశిస్తున్నారట. మరి మణిరత్నం ఈ చిత్రాన్ని పట్టాలు ఎక్కించి అందరి కల నెరవేరుస్తాడా లేదా అన్నది ప్రశ్నలా మిగిలింది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జనవరి నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!