ఇండియా మరియు చైనా సరిహద్దుల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. భారత్ ఆర్మీ కి చెందిన అధికారిని మరియు కొంతమంది సైనికులను చైనా ఆర్మీ చంపేయడం జరిగింది. ఈ ఘటనలో ఆయుధాలు ఉపయోగించక పోయినా కానీ ఇరు దేశాలకు చెందిన సైనికులు అధికారులు పోట్లాడుకోవడం తో చైనా దేశానికి చెందిన కొంతమంది సైనికులు అదేవిధంగా ఇండియాకు చెందిన సైనికులు మరణించడం జరిగింది. చైనా మరియు ఇండియా సరిహద్దు ప్రాంతం లడక్ లో చోటు చేసుకున్న ఈ ఘటన దేశ రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ దృష్టి దగ్గర రావడంతో వెంటనే వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
భారత సైన్యానికి సంబంధించి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తో సమావేశం అయ్యారు. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కూడా ఇదే సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే సరిహద్దు వివాదాలకు సంబంధించి చైనాతో భారత్ మొదటి దశ చర్చలు జరిగాయి. మరికొద్ది రోజుల్లో రెండో దఫా చర్చలు జరిగే అవకాశం ఉన్న టైంలో ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
ఈ నేపథ్యంలో కావాలి అని చైనా…ఇండియా పై దూకుడుగా వ్యవహరిస్తోందని జరిగిన ఈ ఘటన ను ఉద్దేశించి కేంద్ర పెద్దలకు ఆర్మీ అధికారులు చెప్పినట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో ఈ విషయం వైరల్ న్యూస్ కావటంతో ..ఈసారి చైనా కి గట్టిగా చెక్ పెట్టడానికి ఇండియాకి ట్రంపు కూడా సాయం చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. జరిగిన ఘటనపై మోడీ చాలా సీరియస్ గా ఉన్నట్లు…కరోనా కారణంగా చైనా వల్ల ప్రపంచం తీవ్రంగా నష్టపోవడం తో ఈ వేడిలో చైనాకి కుదిరితే చెక్ పెట్టాలని మోడీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.