`ఫిదా` సంచలన విజయం తర్వాత శేఖర్ కమ్ముల ఓ సినిమాను డైరెక్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. నాగ చైతన్య, సాయి పల్లవి క్రేజీ కాంబినేషన్లో సినిమా షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఆన్ లొకేషన్లో జరిగిన పూజా కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాతలు సునీల్ దాస్ కె నారంగ్, ఎఫ్ డి సి చైర్మన్ పి రామ్మోహన్ రావు, భరత్ నారంగ్, కో ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్,డిస్ట్రిబ్యూటర్లు సదానంద్,శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఏసియన్ గ్రూప్స్ అధినేత సునీల్ నారంగ్ శేఖర్ కమ్ముల గారికి స్క్రిప్ట్ అందించారు.
శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య క్లాప్ ఇవ్వగా, డిస్ట్రిబ్యూటర్ సదానంద కెమెరా స్విచ్చాఫ్ చేశారు. ఎమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ..
నిర్మాత పి. రామ్మోహన్ రావు మాట్లాడుతూ “శేఖర్గారి దర్శకత్వంలో సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
మూడు షెడ్యూల్లో ఈ సినిమాను పూర్తి చేస్తాం. ప్రస్తుతం మొదలైన షెడ్యూల్ పది రోజుల పాటు జరుగుతుంది. శేఖర్ కమ్ముల ఒక మంచి మ్యూజికల్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తారు“ అన్నారు.
దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ “విలేజ్ నుండి వచ్చి జీవితంలో ఏదో సాధించాలి అనుకునే ఇద్దరి మధ్య ప్రేమ
కథ ఇది. ఫస్ట్ టైమ్ ఒక మ్యూజికల్ లవ్ స్టొరీలో నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్నారు. తెలంగాణ యాసని నాగ చైతన్య బాగా ఇష్ట పడి నేర్చుకున్నాడు. నాగ చైతన్య పాత్ర ఈ సినిమాకు హైలెట్ అవుతుంది. సాయి పల్లవి ఈ కథకు పెర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎ.ఆర్.రెహమాన్ స్కూల్ నుండి వచ్చిన పవన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు“ అన్నారు.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!