Bheemla Naayak: పవన్ కళ్యాణ్ నటించిన “బీమ్లా నాయక్” త్వరలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి సితార నిర్మాణ సంస్థ ప్రొడక్షన్స్ అధినేత నాగ వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. సితార నిర్మాణ సంస్థ నిర్మించిన డీజే టిల్లు సినిమా ప్రమోషన్ సమయంలో కూడా “బీమ్లా నాయక్” లో పవన్ కళ్యాణ్ నటన విశ్వరూపం చూస్తారని చెప్పటం తో సినిమాపై అంచనాలు డబల్ త్రిబుల్ అయ్యాయి. ఇదే సమయంలో ఓ ప్రైవేట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తో గతంలో ఒక తప్పు చేశామని నాగ వంశీ వైరల్ కామెంట్లు చేశారు.
అది మరేంటో కాదు “అజ్ఞాతివాసి” తో ఒక తప్పు జరిగింది. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో “బీమ్లా నాయక్” తో బ్లాక్ బస్టర్ పవన్ కి ఇస్తాం. ముఖ్యంగా పవన్ అభిమానులకు ఈ సినిమా తో బాకీ తీరుస్తాం అని ప్రొడ్యూసర్ నాగ వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. అందువల్లే “బీమ్లా నాయక్” సినిమాని చాలా బాధ్యతగా చేశామని ఇదే విషయం డైరెక్టర్ సాగర్ చంద్ర కి చెప్పటం జరిగిందని కచ్చితంగా సినిమా అభిమానులను అలరించడం గ్యారెంటీ అని నాగ వంశీ కాన్ఫిడెంట్ గా “బీమ్లా నాయక్” గురించి చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఈ నెల చివరిలో దాదాపు 2500 థియేటర్లకు పైగా “బీమ్లా నాయక్” విడుదల కానున్నట్లు సమాచారం. వాస్తవానికి “బీమ్లా నాయక్” సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కావాల్సింది. కానీ అదే సమయంలో రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం తో ఇండస్ట్రీ మేలుకోసం పవన్ కళ్యాణ్ “బీమ్లా నాయక్” మూవీని వాయిదా వేయడం జరిగింది. ఈ క్రమంలో సమ్మర్ కానుకగా ఏప్రిల్ లేదా మే నెలలో రిలీజ్ అవుతుందని భావించగా ఫిబ్రవరి నెలలోనే “బీమ్లా నాయక్” రిలీజ్ అవుతున్నట్లు వార్తలు రావటం అభిమానుల్లో జోష్ నింపింది.