SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “గుంటూరు కారం” అనే వెరైటీ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. జనవరి నెలలో సినిమా విడుదల కాబోతోంది. గతంలో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఖలేజా, అతడు లాంటి రెండు డిఫరెంట్ జోనర్ కలిగిన సినిమాలు వచ్చాయి. రెండిటిలో కూడా మహేష్ బాబుని చాలా వైవిధ్యంగా చూపించడం జరిగింది. దీంతో “గుంటూరు కారం” లో మహేష్ ఎలా ఉంటాడు అనేది ఆసక్తికరంగా మారింది.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా తర్వాత గ్రేట్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. “SSMB29” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాకి సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. గ్లోబల్ సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో జక్కన్న ఉన్నారు. ఎందుకంటే “RRR” తో ప్రపంచ స్థాయిలో ఊహించని విజయం సాధించటం జరిగింది. అంతేకాకుండా ఆస్కార్ అవార్డు కూడా అందుకోవటం జరిగింది. దీంతో జక్కన్నకి ప్రపంచవ్యాప్తంగా సపరేట్ మార్కెట్ క్రియేట్ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మహేష్ బాబు సినిమా సిద్ధం చేస్తున్నారట.
అయితే ఈ సినిమాలో మహేష్ బాబుకి దీటుగా విలన్ క్యారెక్టర్ ఉండబోతుందని సమాచారం. దీంతో ఆ పాత్రలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ హీరో అమీర్ ఖాన్ నీ తీసుకోవటానికి జక్కన్న రెడీ కావడం జరిగిందంట. ఈ వార్త అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. దాదాపు ₹1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ మరియు యాక్షన్ సన్నివేశాలు కళ్ళు చెదిరా రీతిలో ఉండబోతున్నట్లు హాలీవుడ్ ప్రముఖుల చేత రాజమౌళి వర్క్ చేయించనున్నట్లు సమాచారం.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!