Supreme Court : సామాజిక మాథ్యమాల ద్వారా పలు విమర్శలు చేసినందుకు గానూ మహారాష్ట్రలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నేడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ముంబాయిలో నమోదు అయిన కేసులను హిమాచల్ప్రదేశ్ లోని సిమ్లాకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముంబయిలో కేసుల విచారణకు హజరుకావడం తన ప్రాణాలకు ముప్పు అని, శివసేన నేతల నుండి తనకు ప్రాణ హానీ ఉందని తన పిటిషన్ లో కంగన పేర్కొన్నారు. ఈ కారణంగా ముంబయి కోర్టులో తన పై ఉన్న మూడు కేసులను తన సొంత రాష్ట్రమైన హిమాచల్ప్రదేశ్ కు బదిలీ చేయాలని సుప్రీం కోర్టును కోరారు. కంగన తరపున న్యాయవాది నీరజ్ శేఖర్ పిటిషన్ దాఖలు చేశారు.
సామాజిక మాధ్యమాల ద్వారా మతపరమైన విమర్శలు చేసినందుకు గానూ కంగన రనౌత్ తో పాటు ఆమె సోదరిపై రెండు క్రిమినల్ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. వీటితో పాటు నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తరువాత ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ ఆమెపై పరువునష్టం దావా వేశారు. ఈ కేసులను కొట్టివేయాలని గతంలో కంగన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కంగనకు అనుకూలమైన తీర్పు రాకపోవడంతో తాజాగా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
Actor Kangana Ranaut and her sister Rangoli Chandel have moved the Supreme Court seeking transfer of criminal cases pending against them in various courts of Mumbai to Shimla in Himachal Pradesh
— ANI (@ANI) March 2, 2021