దర్శకుడిగా శ్రీను వైట్ల పంథా ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ తో తీసిన మొదటి సినిమా నీకోసం సినిమా బావున్నప్పటికి ఆ సినిమాలో మేయున్ గా కామెడి కరువైందన్న మాట నాగార్జున చెప్పి సలహా ఇవ్వడంతో ఆ తర్వాత తీసిన ఆనందం సినిమా నుండి కథ లో కామెడీ ని ప్రధాన అంశంగా తీసుకొని అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ సమానంగా ఉండేలా చూసుకుంటూ వరసగా బ్లాక్ బస్టర్స్ ని తీసి స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. అతి తక్కువకాలంలోనే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, కింగ్ నాగార్జున, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, రవితేజ ..ఇలా టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలతో సినిమాలు తీసి హిట్స్ ఇచ్చాడు.
అయితే శ్రీను వైట్ల కెరీర్ ఎంత స్పీడ్ గా సక్సస్ లను అందుకుంటూ సాగిందో అంతే స్పీడ్ గా డౌన్ ఫాల్ కూడా అయింది. వరస ఫ్లాప్స్ వెంటాడి శ్రీను వైట్ల కెరీర్ చిక్కుల్లో పడింది. ఆ మధ్య మాస్ మహారాజ రవితేజ తో ఎన్నో ఆశలు అంచనాలు పెట్టుకొని తీసిన అమర్ అక్బర్ ఆంటోని కూడా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇలియానా ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినప్పటికి అది సినిమాకి ఏమాత్రం ప్లస్ కాలేకపోయింది. ఇక కాస్త గ్యాప్ తీసుకొని మళ్ళీ సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తుంది. తన కెరీర్ లో సంచలన విజయం సాధించిన ఢీ కి సీక్వెల్ తీసే ప్లాన్ లో ఉన్నాడని తాజా సమాచారం.
మంచు విష్ణు ఈ సీక్వెల్ లో కూడా హీరోగా నటిస్తాడని తెలుస్తుంది. మంచు విష్ణు కి ఈ మధ్య కాలంలో సరైన హిట్ దక్కలేదు. ఈ హీరో కూడా భారి సక్సస్ కోసం ఎదురు చూస్తున్నాడు. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఢీ కి సీక్వెల్ ని ప్లాన్ చేశారట. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయిందని త్వరలోనే అధికారకంగా ఈ సినిమాకి సంబంధించిన విషయాలను వెల్లడించనున్నారని సమాచారం. అయితే గతంలోను చాలా సార్లు ఇలాగే ఢీ సినిమాకి సీక్వెల్ వస్తుందన్న వార్తలు వచ్చినప్పటికి అవి కేవలం గాసిప్స్ గానే మిగిలాయి. అయితే ఈసారి మాత్రం పక్కా అంటున్నారు హీరో దర్శకుడు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!