Akhanda: వరస ప్లాపుల్లో ఉన్న నందమూరి బాలయ్య బాబు మర్చిపోలేని హిట్ ఇచ్చాడు బోయపాటి. అఖండ సినిమా చేసి.. బాలయ్య బాబు తో హ్యాట్రిక్ విజయం సాధించడం జరిగింది. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన.. సింహా, లెజెండ్ కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టాయి. ఇప్పుడు ఇదే స్థాయిలో అఖండ సినిమా కూడా.. విజయం సాధించడంతో.. నందమూరి అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాలో బాలయ్య బాబు నటనకు తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. సరిగ్గా సెట్ కావడంతో బోయపాటి టేకింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో.. సినిమా అన్ని రకాల ప్రేక్షకులను అలరించటం జరిగింది.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి రిలీజ్ అయిన అతిపెద్ద సినిమా అఖండ.. అతి పెద్ద విజయం సాధించడంతో నిర్మాతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు ఓవర్ సీస్ లో కలిపి అతి తక్కువ టైంలో 100 కోట్లు కొల్లగొట్టడం జరిగింది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో ఇటీవల పాల్గొన్న నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సినిమా స్థాయిలో విజయం సాధిస్తుందనే ముందే ఊహించాను అని చెప్పుకొచ్చారు.
అదే రీతిలో బాలయ్య అఘోర క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని ఊహించను. ఆ స్థాయిలోనే సినిమా థియేటర్ లో ఘోర పాత్ర కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ స్థాయిలో సాధించిన ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని ఉంది అన్ని మిర్యాల రవీందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇదే రీతిలో హిందీ లో ఈ సినిమా రీమేక్ అయితే అక్కడ అక్షయ్కుమార్ అజయ్ దేవగన్ హీరోగా నటిస్తే సినిమా బాగుంటుంది అని తెలియజేశారు. మార్చి నెలలో కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నట్లు కొత్త హీరోని పరిచయం చేస్తున్నట్లు… కథను బట్టే దానికి తగ్గ పాత్రలను సెలెక్ట్ చేసుకోవడం నాకు అలవాటు అని..మిర్యాల రవీందర్ రెడ్డి ఇటీవల చెప్పుకొచ్చారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!