అఖిల్ అక్కినేని, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా సెట్స్పై ఉండగానే తదుపరి సినిమాకు అఖిల్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడని సమాచారం. ఇటీవల `అ!` ఫేమ్ ప్రశాంత్ వర్మదర్శకత్వంలో అఖిల్ సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా.. గీతాఆర్ట్స్ బ్యానర్లో మరో సినిమా చేయడానికి అఖిల్ అక్కినేని రెడీ అవుతున్నాడని వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమాను పరుశురామ్ డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇది వరకు మహేశ్, పరుశురాం కాంబినేషన్లో సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి. కానీ.. ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలేదట. దాంతో అఖిల్తో సినిమా చేయాలని పరుశురాం అనుకుంటున్నాడట. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుందట.
previous post
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!