స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ మాటల మాంత్రికుడు సుప్రసిద్ధ సినీ దర్శకుడు ‘త్రివిక్రమ్’ ల కాంబినేషన్లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్పై కొత్త చిత్రం నేడు హైదరాబాద్లో ప్రారంభమైంది. హీరోగా అల్లు అర్జున్ కు ఇది 19 వ చిత్రం కాగా, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడవ చిత్రం. కథానాయికగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల విజయాల నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 24 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమవుతుందని చిత్ర నిర్మాతలు తెలిపారు.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!