టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్లో అనుష్కకు ఉన్న క్రేజే వేరు. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి చిత్రాలతో ఆమె తన మార్కెట్ పరిధిని పెంచుకున్నారు. తాజాగా స్లిమ్గా తయారైన తర్వాత అనుష్క చేస్తోన్న క్రాస్ ఓవర్ చిత్రం `సైలెన్స్`. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో కోనవెంకట్, టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాధవన్, హాలీవుడ్ మ్యాడ్సన్, అంజలి, షాలిని పాండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ్తో పాటు హిందీ, ఇంగ్లీష్లోనూ విడుదల చేస్తున్నారు. తెలుగులో నిశ్శబ్ధం పేరుతో మిగతా మూడు లాంగ్వేజెస్లో సైలెన్స్ అనే పేరుతో సినిమా విడుదలవుతుంది. సినిమా దాదాపు పూర్తయ్యింది. రీసెంట్గా ప్రచార చిత్రం కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు అనుష్క మూడు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుందట. సినిమా బడ్జెట్, రిలీజ్ను బేస్ చేసుకుని నిర్మాతలు అనుష్క అడిగినంత ఇవ్వడానికి రెడీ అయ్యారట. ఈ ఏడాది చివరలో సినిమా విడుదలవనుంది.
previous post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!