అమరావతి: కాపు కార్పోరేషన్ చైర్మన్గా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ పదవిలో రాజా రెండేళ్లపాటు కొనసాగనున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన సీనియర్ నేత, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు కుమారుడు జక్కంపూడి రాజ. జక్కంపూడి రామ్మోహనరావు మరణం తరువాత ఆయన కుటుంబం జగన్కు మద్దతుగా నిలిచింది. 2014 ఎన్నికల్లో వైసిపి నుండి పోటీ చేసిన జక్కంపూడి సతీమణి ఓడిపోయారు.
జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువజన నేతగా జక్కంపూడి కుమారుడు రాజా యువభేరి కార్యక్రమాల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల జరిగిన ఎన్నికలో తూర్పు గోదావరి జిల్లా రాజానగరం వైసిపి అభ్యర్థిగా రాజా గెలుపొందారు. కాపు కార్పేరేషన్ చైర్మన్ పదవిని చాలా మంది కాపు ఎమ్మెల్యేలు, మాజీలు ఆశించినప్పటికీ జక్కంపూడి రాజాను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఎంపిక చేసినట్లు సమాచారం.