మళయాళ సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాద సంఘటనలు జరుగుతున్నాయి. గత ఏడాది మళయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా ‘అయ్యప్పణుమ్ కోషియమ్’. పృథ్వీరాజ్, బిజూ మీనన్ హీరోలుగా నటించిన ఈ సినిమా కథ, కథనం, దర్శకత్వం.. చాలా హైలైట్ అయ్యాయి. ఈ సినిమా దర్శకుడు ‘సాచి’ ఈ ఏడాది గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన మళయాళ ఇండస్ట్రీని, ప్రేక్షకుల్ని విషాదంలో ముంచెత్తింది. ఇప్పుడు ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన నటుడు మృతి చెందడం మరింత విషాదాన్ని నింపుతోంది. ప్రస్తుతం ఈ ఘటన మళయాళ ఫిలిం ఇండస్ట్రీని షాక్ కు గురి చేసంది.
సినిమాలో కీలకమైన పోలిస్ ఆఫిసర్ సతీష్ కుమార్ పాత్రలో నటించిన నటుడు ‘అనిల్ నెదుమంగాడ్’. శుక్రవారం ఆయన ఎర్నాకుళం జిల్లాని మవత్తుపుళం ప్రాంతానికి వెళ్లారు. అక్కడ జోజు జార్జి హీరోగా నటిస్తున్న ‘పీస్’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో అనిల్ కూడా నటిస్తున్నారు. షూటింగ్ లో పాల్గొన్న అనంతరం అనిల్ తన స్నేహితులతో కలిసి సమీపంలో ఉన్న మలంకర డ్యామ్ వద్దకు వెళ్లారు. అందరూ సరదాగా స్నానం చేయాలనే ఉద్దేశంతో అనిల్తో సహా డ్యామ్ లోకి దిగారు. అయితే.. ప్రమాదవశాత్తూ అనిల్ నీళ్లలో మునిగిపోయారు. స్నేహితులు ఆయన్ను కాపాడాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అరగంట తర్వాత అనిల్ ను బయటకు తీసుకొచ్చారు.
వెంటనే ఆయన్ను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. దీంతో పీస్ సినిమా యూనిట్, మళయాళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అనిల్ మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతిపై పృథ్వీరాజ్, బిజుమీనన్, దుల్కర్ సల్మాన్ తదితరులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న అనిల్ మృతి బాధాకరమని సంతాపం వెలిబుచ్చారు. అయ్యప్ఫణుమ్ కోషియమ్ సినిమానే తెలుగులో పవన్ కల్యాణ్, రానా హీరోలుగా సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇటివలే మరో మళయాళీ దర్శకుడు సానవాస్ షూటింగ్ స్పాట్ లోనే మృతి చెందారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!