Double iSmart: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హిట్ అందుకుని నాలుగు సంవత్సరాలు దాటేసింది. 2018 సంవత్సరంలో “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో హిట్ అందుకున్నారు. ఈ సినిమా రాకముందు వరుస పరాజయాలలో ఉన్నారు. అలాంటి పరిస్థితులలో రామ్ హీరోగా “ఇస్మార్ట్ శంకర్” చేసి హిట్ అందుకోవటం జరిగింది. వరుసపరాజయాలలో ఉన్న రామ్ కి ఈ సినిమా మంచి కం బ్యాక్ ఫిలిం అయింది. 2018 జూలై 18వ తారీకు విడుదలైన ఈ సినిమా బీసీ సెంటర్లలో అత్యధికమైన వసూల్ రాబట్టింది. ఓర మాస్ గా రామ్ నీ అప్పటివరకు ఎవరు చూపించని విధంగా పూరి జగన్నాధ్ ఈ సినిమాలో చూపించారు. అంతకుముందు రామ్ కి చాలావరకు క్లాస్ మరియు అమ్మాయిల ఇమేజ్ ఎక్కువగా ఉండేది.
ఈ క్రమంలో పలుమార్లు మాస్ సినిమా చేసిన అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కానీ పూరి జగన్నాథ్ అదే రామ్ తో “ఇస్మార్ట్ శంకర్” చేసి హిట్ అందుకోవటం జరిగింది. ఇప్పుడు “డబుల్ ఇస్మార్ట్” చేస్తున్నారు. పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కలయికలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా మార్చ్ 8 వ తారీకు వేసవి సందర్భంగా విడుదల చేయాలని మొదట భావించారు. కానీ ఇప్పుడు సినిమా అనుకున్న సమయానికి విడుదల అయ్యే అవకాశం లేదని ఇండస్ట్రీలో సరికొత్త వార్త వైరల్ అవుతుంది. కారణం చూస్తే ఇటీవల షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడింది.
నేను అనుకున్న సమయానికి విడుదలయ్యే అవకాశం లేదని ఏప్రిల్ నెల కరోనా లేదా మేలో “డబుల్ ఇస్మార్ట్” రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి మళ్లీ…. ఫ్లాపులగుండా వెళ్తున్నారు. 2022లో “లైగార్” చేసి అట్టర్ ఫ్లాప్ చూడడం జరిగింది. పాన్ ఇండియా నేపథ్యంలో పూరి జగన్నాధ్ తీసిన ఈ చిత్రం ఏమాత్రం ప్రేక్షకులను అల్లరించలేకపోయింది. దీంతో ఇప్పుడు “డబల్ ఇస్మార్ట్” పై భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!