ఇండస్ట్రీలోనే మాస్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉన్న హీరో నరసింహం నందమూరి బాలయ్య బాబు. తన తరం నటులు సినిమాలు చేయటంలో స్పీడు తగ్గించినా గానీ… బాలయ్య మాత్రం.. ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోల కంటే మించి మరి కొత్త సినిమాలు చేస్తూ ఉన్నారు. దర్శకులకు సత్తా ఉంటే సంవత్సరానికి నాలుగు సినిమాలైనా విడుదల చేస్తానని.. బహిరంగంగానే ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే మామూలుగా బాలయ్య ఎక్కడికైనా బయటకు వస్తే అభిమానులకి సంబంధించిన రకరకాల ఘటనలు చోటు చేసుకోవడం తెలిసిందే.
చాలాసార్లు బాలయ్య బాబు సొంత అభిమానులపై చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కాగా తాజాగా బాలయ్య బాబు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “NBK 107” వర్కింగ్ టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్.. కర్నూలు జిల్లా కొండారెడ్డి బురుజు సెంటర్ వద్ద జరుగుతుంది. అయితే బాలయ్య షూటింగ్ నేపథ్యంలో ఆ ప్రాంతానికి అభిమానులు పోటెత్తారు. దీంతో తన సినిమా షూటింగ్ చూడటానికి వచ్చిన అభిమానులకు భోజనం పెట్టాలని నిర్మాతలకు తెలియజేశారు అంట.
సోమవారం మధ్యాహ్నం సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ యాజమాన్యం… సినిమా షూటింగ్ ప్రదేశానికి వచ్చిన బాలయ్య అభిమానులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగిందంట. దీంతో తమ అభిమాన హీరో భోజనం పెట్టించడంతో… బాలయ్య ఫ్యాన్స్ సంతోషపడటం జరిగిందంట. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది. బాలయ్య మనసు వెన్న అని తాజా వార్తపై సోషల్ మీడియాలో నెటిజెన్ లు కామెంట్ లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి విడుదల మొదట దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని భావించగా ఇప్పుడు “అఖండ” విడుదలైన తేదీన డిసెంబర్ రెండవ తారీకు విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.