Garikapati vs Chiranjeevi: దసరా తర్వాత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో “అలయ్ బలయ్” కార్యక్రమం నిర్వహించడం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు కూడా హాజరు కావడం జరిగింది. అయితే గరికపాటి ప్రసంగిస్తున్న సమయంలో అప్పుడే చిరంజీవి రావడంతో సభకి వచ్చిన వారి దృష్టి మొత్తం చిరంజీవిపై పడటంతో.. పాటు వేదికపై ఉన్న ఆడవాళ్లు ఒక్కసారిగా చిరంజీవితో ఫోటోలు దిగటానికి ఎగబడ్డారు.
అసహనానికి లోనైనా గరికపాటి చిరంజీవిపై సీరియస్ కావటం.. సంచలనం సృష్టించింది. దీంతో వేదికపై అందరూ చూస్తుండగానే మైక్ లో చిరంజీవిపై గరికపాటి దురుసుగా మాట్లాడారు. ఆ టైములో గరికపాటి చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులకి తీవ్ర ఆగ్రహం తీసుకురావడం జరిగింది. అయితే ఈ వివాదం పై పెద్దగా చిరంజీవి స్పందించలేదు. పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో గరికపాటిమీద ఇన్ డైరెక్ట్ గా చిరంజీవి పంచ్ వేశారు. పూర్తి విషయంలోకి వెళ్తే సీనియర్ సినిమా జర్నలిస్టు ప్రభువు రచించిన “శూన్యం నుంచి శిఖరాగ్రాలకు” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనడం జరిగింది.
అయితే ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడిన తర్వాత ఆయనతో ఫోటోలు దిగడానికి మహిళలు స్టేజి మీద ఎగబడ్డారు. చిరంజీవికి పుష్పగుచ్చం అందజేశారు. దీంతో ఒక్కసారిగా ఆడవాళ్లు తనతో ఫోటోలు దిగడానికి రావడంతో వెంటనే చిరంజీవి “ఇక్కడ వారు లేరు కదా” అంటూ వేలు పైకి చూపిస్తే గరికపాటి నరసింహారావుపై పరోక్షంగా సెటైర్ వేయడంతో.. అందరూ ఒక్కసారిగా నవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు మురళీమోహన్… ఇండస్ట్రీకి చెందిన పలువురు పెద్దలు మరియు పాత్రికేయులు హాజరు కావడం జరిగింది.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!