Chiranjeevi: తెలుగునాట టాలీవుడ్ పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి అభిమాని లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి లేదేమో. తన నటనతో తెలుగువారి ఇండ్లలో ఒక సభ్యుడు అయిపోయాడు మన మెగాస్టార్. ప్రస్తుతం ఆయన చేతి నిండా అరడజను సినిమాలు వున్నాయి. గాడ్ ఫాదర్, భోళా శంకర్, మెగా 154 ఇలా పలు చిత్రాలను ఆయన లైన్లో పెట్టారు. తెలుగు సినిమా దర్శకులు అతనిని డైరెక్ట్ చేయాలని కలలు కంటూ వుంటారు. ఇప్పటికే చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్న చిరు.. తాజాగా మరో సినిమాను ప్రకటించారు. అయితే ఇది సంతోషించదగ్గ విషయం అయినప్పటికీ మెగాభిమానులు మాత్రం ఈ విషయం పైన ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Chiranjeevi: మెగాభిమానుల బాధకు కారణం ఇదేనా?
ఇక మన మెగాస్టార్ ప్రకటించిన దర్శకుడి పేరు ఈపాటికే అర్ధం అయి ఉంటుంది. అతడే డైరెక్టర్ మారుతి. అవును.. అతని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు చిరు చెప్పుకొచ్చారు.. దీనికి మారుతి – గోపిచంద్ కాంబోలో రాబోతున్న చిత్రం పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదిక అయ్యింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన చిరు తన తదుపరి ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేశారు. దాంతో మెగాభిమానులు చివుక్కుమన్నారు. మారుతికి గతంలో హిట్లు పడ్డప్పటికీ పెద్ద హీరోలను డీల్ చేసే విషయంలో మారుతి తడబడతాడని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Chiranjeevi: మెగాస్టార్ ఏం మాట్లాడారు?
ఈ వైదికపైన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. “UV క్రియేషన్స్ నిర్వాహకులు విక్కి, ప్రమోద్ చరణ్ కు మంచి స్నేహితులు. వీళ్లు మా ఇంట్లో మనుషుల్లాగే వుంటారు. ఒకసారి విక్కీ నాతో మాట్లాడుతూ, మీ కాంబినేషన్లో దర్శకుడు మారుతితో ఓ సినిమా చేయాలని వుంది!” అని అన్నారు. దానికి నేను వెంటనే ఓకే అన్నాను. మేము భవిష్యత్తులో కచ్చితంగా ఓ సినిమా చేస్తాం. “మారుతి! నీకున్న కమిట్స్మెంట్స్ త్వరగా పూర్తి చేయి. ఆ తర్వాత మనం కలిసి సినిమా చేద్దాం. పక్కా కమర్షియల్ గా ఇక్కడ బేరం కుదిరిపోయింది.” అంటూ కుండబద్దలు కొట్టారు మెగాస్టార్. దాంతో మెగాభిమానులు ఖంగు తిన్నారు.