Chiranjeevi: కరోనా తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఎక్కువ ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతున్నారు. “భోళా శంకర్” పరాజయం పాలైన తర్వాత చాలావరకు రెస్ట్ తీసుకున్నారు. మధ్యలో అనేక కథలు విన్నారు. అదే సమయంలో మోకాలి సర్జరీ కూడా జరిగింది. అనంతరం వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించి ఇటలీలో సందడి చేశారు. ఆ తర్వాత “విశ్వంభర” షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా మారేడుపల్లి అడవులలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత మొన్నటి వరకు సంక్రాంతి హడావిడిలో కుటుంబంతో కలిసి కార్యక్రమాలలో పాల్గొన్నారు.
అనంతరం “విశ్వంభర” షూటింగ్ కి సంబంధించి వర్కౌట్ చేయడం జరిగింది. ఆ సమయంలో త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతున్నట్లు చిరంజీవి తెలిపారు. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని మెగా ఫాన్స్ భావిస్తుండగా… చిరంజీవి ఫిబ్రవరి 14వ తారీకు నాడు భార్య సురేఖతో చిన్న హాలిడే ట్రిప్ అమెరికాకి ప్లాన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా భార్య సురేఖతో విమానంలో దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ వాలెంటెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసి… ఈ టూర్ ముగిసిన వెంటనే “విశ్వంభర” షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్లు స్పష్టం చేశారు. చిరంజీవి కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
యువి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటిస్తోంది. ఎంఎం కీరవాణి సినిమాకి సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10వ తారీకు విడుదల చేయబోతున్నట్లు ఆల్రెడీ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు సోషల్ ఫాంటసీ చిత్రం కావటంతో కొత్త తరహా విజువల్ ఎఫెక్ట్స్ ఉండేలా దర్శకుడు మల్లిడి వశిష్ట శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. చిరంజీవి కెరియర్ లోనే ఈ సినిమా చాలా హైలైట్ గా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.