Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి అన్నారు. కేసిఆర్ మళ్లీ ఎలా అధికారంలోకి వస్తారో తాను చూస్తానని అన్నారు. అసెంబ్లీకి రాని వారికి అధికారం ఎందుకని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీతో కొట్లాడదామంటే కేసిఆర్ ఇంటి నుండి బయటకు రావడం లేదని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బుధవారం పోలీస్ అభ్యర్ధుల నియామక పత్రాల అందించే కార్యక్రమంలో మాట్లాడుతూ .. కేసిఆర్ తన బంధువులకే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శించారు. ఒక్కో సమస్య పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో రెండు లక్షల ఉద్యగాలను భర్తీ చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు కంచరగాడిదను తరిమికొట్టి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని అన్నారు. నిన్న నల్లగొండ సభలో నేనేం తక్కువ చేశా.. పాలిచ్చే గెదెను వద్దని దున్నపోతును తెచ్చుకున్నారు అని కేసిఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్ ఇలా ఇచ్చారు.
అసెంబ్లీలో చర్చకు రమ్మంటే రారని, నల్లగొండ కు వెళ్లి సభ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని ఆయన అన్నారు. తెలంగాణ యువతకు ఇచ్చిన మాటను తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని తెలిపారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామనీ, త్వరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కేసిఆర్ తనను చంపుతారా అని ప్రశ్నిస్తున్నారనీ, చచ్చిన పామును ఎవరు చంపుతారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పటికీ గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేకపోయిందని అన్నారు.
ఒక జనరేషన్ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. తన కుటుంబ సభ్యులు మాత్రం ఓడిపోయిన వెంటనే పదవులు ఇచ్చుకోవడం తెలిసిన కేసిఆర్ కు నిరుద్యోగులకు ఉపాది కల్పించాలన్న ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని కేసిఆర్ నిన్న నల్లగొండ సభలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా, ప్రజలు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు కూడా తెలంగాణను పాలిస్తా..నేను ఇక్కడే ఉంటా.. కేసిఆర్ ఎలా అధికారంలోకి వస్తారో చూస్తా అని రేవంత్ రెడ్డి అన్నారు.
Telangana BJP: ఎట్టకేలకు బీజేపీ ఎల్పీ నేత ఎంపిక