సాధారణంగా ఒక్క టాలీవుడ్ అని కాదు ఏ ఇండస్ట్రీలో అయినా ఒక సూపర్ హిట్ విజయాన్ని సాధించిన హీరో ఆ సినిమా అనంతరం ఓ రాడ్ సినిమాలో నటిస్తే తమ ఫ్యాన్స్ ఎంతగానో బాధపడతారు. అదేవిధంగా ఆ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ని అయితే ఫుల్ గా ఏకేస్తారు. ఇక ఇదే విషయం సూపర్ స్టార్ రజినీకాంత్ విషయంలో కూడా జరిగింది.
జైలర్ సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించుకున్న రజిని ఇటీవలే లాల్ సలాం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి ఓ రోడ్ గా నిలిచాడు. ఇక ఈ సినిమాని తెరకెక్కించింది రజనీ కూతురు ఐశ్వర్య. ఐశ్వర్య మరియు రజనీకాంత్ ప్రేక్షకులకి దగ్గరవ్వడానికి అందించిన సందేశం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు.
అదేవిధంగా ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా కథ చాలా ఓల్డ్ మూవీ లాగా కనిపిస్తుంది. డైరెక్టర్ గా మరియు స్క్రీన్ రైటర్ గా ఐశ్వర్య స్క్రిప్ట్ రైటర్ విష్ణు రంగస్వామిని మరింత ఎమోషన్స్ తో నింపడానికి ట్రై చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఈ సినిమాలో ఐశ్వర్య రాసిన ఎమోషనల్ సీన్స్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. అదేవిధంగా అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకపోవడంతో వాటి ప్రభావాన్ని మరింత కిందకి తొక్కేసాయి.
అదేవిధంగా డబ్బింగ్ సెక్షన్ కారణంగా తెలియకపోవడం కూడా ఇందుకు ముఖ్య కారణం అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ మరియు జోక్స్ ని యాడ్ చేసి ఉంటే బాగుండు అని అనిపించింది. ఏదేమైనప్పటికీ జైలర్ వంటి సూపర్ హిట్ విజయంతో ఉన్న రజినీకి భారీ డిజాస్టర్ ని ఇచ్చింది ఐశ్వర్య. రజిని పరువు ని మొత్తం గంగలో కలిపేసింది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాని చూసిన పలువురు రజిని ఫ్యాన్స్ ఐశ్వర్య పై మండిపడుతున్నారు.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?