Prashanth Neel: `కేజీఎఫ్ చాప్టర్ 1`తో సంచలనం సృష్టించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఇప్పుడు `కేజీఎఫ్ చాప్టర్ 2`తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. రాక్స్టార్ యశ్ హీరోగా రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రం ఏప్రిల్ 14న గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ 2తో పాటు తన ఇతర ప్రాజెక్ట్ల వివరాలను షేర్ చేసుకున్నారు. అలాగే టాలీవుడ్లో తాను ఓ హీరోకు పెద్ద ఫ్యాన్ అంటూ సీక్రెట్ను సైతం రివిల్ చేశారు. ఇంతకీ ప్రశాంత్ నీల్ అభిమానించే ఆ టాలీవుడ్ హీరో ఎవరో కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.
`నేను గత ఇరవై ఏళ్లుగా ఎన్టీఆర్ అభిమానిని. మేము స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించాక పది నుంచి పదిహేను సార్లు కలిశాం. ఆయనకు స్క్రిప్ట్ నచ్చడంతో దానిపై పూర్తిగా వర్క్ చేస్తున్నాను. ఈ సినిమా విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నాను. దయచేసి అది ఏ జోనర్ అని నన్ను అడగొద్దు` అంటూ ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.
కాగా, ప్రస్తుతం ప్రభాస్తో `సలార్` మూవీ చేస్తున్న ప్రశాంత్.. ఆ తర్వాత ఎన్టీఆర్తో ఓ కొత్త ప్రాజెక్ట్ను పట్టాలెక్కించబోతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. వీలైనంత వరకు ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు ఎన్టీఆర్ కొరటాల శివతో ఈ మూవీ చేయనున్నాడు.