Acharya: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం `ఆచార్య`. ఇందులో మెగా వపర్ స్టార్ ఓ కీలక పాత్రలో కనిపించబోతుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేశారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం గత ఏడాదే విడుదల కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.
అయితే ఎట్టకేలకు ఈ మూవీ ఏప్రిల్ 29న గ్రాండ్ రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్, సాంగ్స్ వంటివి సినిమాపై భారీ అంచనాలను పెంచగా.. మరింత హైప్ క్రియేట్ చేయడం కోసం మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 12న ఈ సినిమా ట్రైలర్ను లాంఛ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
అయితే తాజాగా ఈ ట్రైలర్ విషయంలో చిత్ర టీమ్ మెగా ఫ్యాన్స్కు మరో గుడ్న్యూస్ను కూడా తెలియజేసింది. అదేంటేంటే.. ఆచార్య ట్రైలర్ను యూట్యూబ్లో మాత్రమే కాకుండా థియేటర్స్లో సైతం విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్ 12 సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకి ఈ సినిమా ట్రైలర్ను వదలబోతున్నామని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.
అలాగే థియేటర్స్ లిస్ట్ ని కూడా త్వరలోనే చెబుతామని పేర్కొన్నారు. దీంతో రేపు ఆచార్య ట్రైలర్తో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే అంటూ మెగా ఫ్యాన్స్ తెగ సంభరపడిపోతున్నారు. కాగా, దేవాలయ భూముల ఆక్రమణకి సంబంధించిన సామాజిక అంశంతో ఈ సినిమాను రూపొందించారు. ఇందులో సోనూసూద్ కీలక పాత్ర పోషిస్తుండగా.. మణిశర్మ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్గా నిలవబోతోంది.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!