Aacharya: కొరటాల శివ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, చిరంజీవి కలిసి చేసిన సినిమా ఆచార్య. కరోనా వైరస్ ప్రపంచం లోకి ఎంట్రీ ఇవ్వక ముందే ఈ సినిమా షూటింగ్ దాదాపు 40శాతం కంప్లీట్ అయింది. కానీ కరోనా కారణంగా దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు షూటింగ్ ఆగుతూ సాగుతూ ఎట్టకేలకు కంప్లీట్ అయ్యి ఈనెల 29వ తారీకు వేసవి కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధమయ్యింది. ఫస్ట్ టైం చిరంజీవి, చరణ్ కలసి..ఫుల్ లెంగ్త్ టైమ్ ఉన్న సినిమాలో నటిస్తూ ఉండటంతో… మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. పైగా ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ఆర్ఆర్ఆర్” సూపర్ డూపర్ హిట్ కావడంతో… ఆచార్య పై మరింత అంచనాలు పెరిగిపోయాయి.
దాదాపు ఈ సినిమాలో చరణ్ పాత్ర 40 నిమిషాల పాటు ఉంటుందని “ఆచార్య”కి చరణ్ క్యారెక్టర్ యే పునాది అని ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటిస్తూనే మరో పక్క నిర్మాతగా కూడా చరణ్ రాణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ త్వరలో రిలీజ్ చేయాలని చరణ్ డిసైడ్ అయినట్లు సమాచారం. అంతకంటే ముందు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా దాదాపు 1500 నుండి 2000 దియేటర్ లలో విడుదల చేసే ఆలోచనలో చరణ్ వున్నట్లు లేటెస్ట్ టాక్ ఫిలిం నగర్ లో వినపడుతోంది. “ఆచార్య” సినిమా విడుదలయ్యే టయానికి రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద సినిమా విడుదల అయ్యే పరిస్థితి లేని నేపథ్యంలో… చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అంతమాత్రమే కాదు ఏప్రిల్ మూడో వారం నుండి చరణ్.. చిరంజీవి కలిసి ఇద్దరు ఆచార్య ప్రమోషన్ కార్యక్రమాలు దాదాపు వారం రోజుల పాటు ఏకధాటిగా చేయాలని డిసైడ్ అయినట్లు.. ప్రీ రిలీజ్ వేడుక ఒకటి తెలంగాణలో మరొకటి ఆంధ్రాలో కూడా నిర్వహించాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి శిష్యుడు పాత్రలో చరణ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా చిరంజీవి పక్కన హీరోయిన్ పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఒక్క ఫ్లాప్ లేని తిరుగులేని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” వస్తూ ఉండటంతో… ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!