పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత విరామం తర్వాత తిరిగి సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసినదే. ఈ తరహాలో ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా కొంతవరకు చిత్రీకరణ జరిగింది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. వకీల్ సాబ్ సినిమా తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు.
అన్నింటికన్నా ముందు వకీల్ సాబ్ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హిందీలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన”పింక్”అనే చిత్రాన్ని రీమేక్ గా వకీల్ సాబ్ సినిమాను నిర్మించనున్నట్లు దర్శకుడు వేణు శ్రీరామ్ తెలిపారు. ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్ కలసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా దాదాపు అన్ని సినిమాలు ఓటిటీలో విడుదలయ్యాయి. ఈ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు కు చాలా ఓటీటీ సమస్తలు ఎన్నో ఆఫర్లను తన ముందు ఉంచిన, అందుకు దిల్ రాజు ఒప్పుకో లేదనే వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఏమిటంటే వకీల్ సాబ్ సినిమా సాటిలైట్ రైట్స్ ను సన్ నెట్వర్క్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సినీ వర్గాల సమాచారం. అయితే వకీల్ సాబ్ సినిమాను మనం జెమిని టీవీ లో చూడవచ్చు.
ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాణం దాదాపుగా పూర్తి కావస్తోంది. లాక్ డౌన్ తర్వాత ఈ చిత్ర నిర్మాణం జరుపుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై చిత్రీకరించిన సన్నివేశాలు కాకుండా, ఇతర ఆర్టిస్టులపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే త్వరలోనే పవన్ కళ్యాణ్ షూటింగులో పాల్గొంటున్నారని, అతనిపై తీసే సన్నివేశాలని త్వరలోనే చిత్రీకరిస్తారని చిత్ర బృందం తెలిపింది. అయితే మరి కొద్ది రోజుల్లోనే వకీల్ సాబ్ టీజర్ ను విడుదల చేయనున్నట్లు సినీ వర్గాల సమాచారం.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!