Guntur Kaaram:సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన మాస్ అండ్ యాక్షన్ మూవీ ” గుంటూరు కారం “. ఈనెల 12న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు ప్రత్యేకంగా అనుమతులు తీసుకున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ నుంచి ఈ సినిమా కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా జీవోలు విడుదల చేశాయి.
టికెట్ రేట్లు పెంపుతో పాటు అదనపు ఆటల సౌకర్యాన్ని కలిగించాయి. ఇక ఇప్పుడు ప్రత్యేక అనుమతులు ఏవి పనిచేసేలా కనిపించడం లేదు. ఈ సినిమాకు 18వ తేదీ వరకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది తెలంగాణ సర్కారు. ఈ వారం రోజుల్లో టికెట్ రేట్లు పెంచుకోవడంతో పాటు.. రోజుకు 6 షోలకు కూడా అనుమతి ఇచ్చింది. ఇక ఈ సినిమా ఫలితం ఊహించిన దానికి భిన్నంగా వచ్చింది.
ఇక దీంతో హైదరాబాద్ తో పాటు చాలా ప్రాంతాలలో ఉదయం 4 గంటల షోలు రద్దయ్యాయి. అతి తక్కువ స్క్రీన్స్ లో మాత్రమే ఉదయం 7.30 , 8.40 షోలు షెడ్యూల్ చేశారు. 90 శాతానికి పైగా స్క్రీన్లు ఎప్పటి లాగానే రోజుకు నాలుగు ఆటలకు పరిమితమయ్యాయి. అయినప్పటికీ ఆన్ లైన్ బుకింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఇక ఇంత కష్టపడి అనుమతులు తీసుకుని వచ్చి దారుణంగా ఓడిపోయారు గుంటూరు కారం టీం. ఇక ఈ కష్టమంతా ఆవిరి అయిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!