Breaking: RRR, KGF సందడి ముగిసిపోయింది. ఇపుడు అంతా మన మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమా పైనే అంచనాలు పెట్టుకున్నారు. ఇక మెగాభిమానులు అయితే వేయి కళ్ళతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు నటించడం వలన ఈ సినిమాకు కావాల్సినంత హైప్ వచ్చింది. కాగా ఎల్లుండి అనగా, 23న ప్రీ రిలీజ్ ఫంక్షన్ యూసఫ్ గుడా పోలీస్ గ్రవుండ్స్ లో ఘనంగా జరగబోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మొన్నటికి మొన్న జగన్ ముఖ్య అతిధి అన్నవారు కాస్త అతన్ని పక్కన పెట్టినట్టు తెలిసిపోయింది. దాంతో ఇక్కడ ముఖ్య అతిధి ఎవరు? అన్న ప్రశ్నకు ఇపుడు సమాధానం లభించింది. దర్శక ధీరుడు మన SS రాజమౌళిని చిరంజీవే స్వయంగా ఆహ్వానించినట్టు భోగట్టా. శ్రేయాస్ ఈవెంట్స్ నిర్వహించే ఈ ఈవెంట్ లో స్టేజ్ మీద రాజమౌళి, కొరటాల, మెగాస్టార్, రామ్ చరణ్, పూజా హెగ్డే అలరించబోతున్నారు. వారితోపాటు పలువురు సినిమా సెలబ్రిటీ డైరక్టర్లు ఈ ఫంక్షన్ కు హాజరు కాబోతున్నారు.