Keerthy Suresh: “మహానటి” సినిమా తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ దక్షిణాది సినిమా రంగంలో దూసుకుపోతోంది. దాదాపు టాప్ హీరోలందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ “మహానటి” సినిమాకి గాను జాతీయ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమాలో నటించగా.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా చేస్తూ ఉంది.
ఇక ఇదే తరుణంలో మరో పక్క చిన్న చిన్న సినిమాలు కూడా చేస్తూ ఉన్న కీర్తి సురేష్… తాజాగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నట్లు అందరు సబ్ స్క్రైబ్ చేసుకోవాలి అని సోషల్ మీడియాలో ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా తన ఛానల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపింది. తన ఛానల్ ను అందరూ సబ్ స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూడాలని కోరింది. యూట్యూబ్ ఛానల్ ద్వారా పర్సనల్ విషయాలతోపాటు ఫోటో షూట్ లు మరియు భవిష్యత్తులో చేయబోయే సినిమాల గురించి అభిమానులకు సమాచారం ఇచ్చే రీతిలో.. ఉండబోతున్నట్లు టాక్.
ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు తమ కంటూ స్టాండ్ వుండేలా సోషల్ మీడియాలో రకరకాల ఎకౌంటు ఓపెన్ చేస్తూ ఉన్నారు. తమ పై వచ్చే రూమర్స్ కి సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు ఇదే రీతిలో కీర్తి సురేష్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నట్లు… యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆమె తాజాగా నటించిన “గుడ్ లక్ సఖి” సినిమా ఈ నెల 28వ తారీఖున థియేటర్ లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి రిపబ్లిక్ డే జనవరి 26 వ తారీకు ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేడుకలో కీర్తి సురేష్ రాజారావు గా చీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్ రావటం జరిగింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!