Pooja Hegde : ప్రస్తుత కాలంలో సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2023లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక కొత్త కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పటికీ నిత్యం ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే సీనియర్ తమిళ్ స్టార్ హీరో విజయ్ కాంత్ మరణించారు. ఇక అప్పటినుంచి కనీసం వారానికి ఒక విషాదం జరుగుతుంది.
ఇక ఇదిలా ఉంటే.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ కెరీర్ మొదట్లో మంచి ఫామ్ లో కొనసాగినప్పటికీ.. ప్రస్తుతం ఈమెకి పెద్ద గా అవకాశాలు రావడం లేదు. ఈ క్రమంలోని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాలను ఆరబోస్తుంది. ఇక ఈరోజు పూజా హెగ్డే అభిమానులకు ఓ బాడ్ న్యూస్. రెండు రోజుల క్రితమే పూజ సిస్టర్ భూమి శెట్టి వివాహం చేసుకుంది. ఇక ఫ్యామిలీతో కలిసి ఆ పెళ్లిలో బాగా ఎంజాయ్ చేసింది పూజ.
ఇక ఈ తరుణంలోనే ఆమె ఫ్యామిలీలో ఓ విషాదం చోటుచేసుకుంది. పూజా హెగ్డే కి ఎంతో ఇష్టమైన తన అమ్మమ్మ గారు ఇటీవల మరణించారు. పూజకి తన అమ్మమ్మ అంటే చాలా ఇష్టమట. గతంలో ఈ ముద్దుగుమ్మ తన అమ్మమ్మతో గడిపిన మధుర క్షణాలకి సంబంధించిన ఫోటోలను చాలాసార్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక తాజాగా ఓ ఫోటోని షేర్ చేస్తూ..” వుయ్ మిస్ యు అజి “అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది పూజ. ప్రస్తుతం ఈమె పోస్ట్ చూసిన అభిమానులు కంటతడి పెడుతున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!