Hanuman : తాజాగా సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సినిమాలలో యంగ్ హీరో తేజ హీరోగా నటించిన ” హనుమాన్ ” ఒకటి. గుంటూరు కారంతో పోటా పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా మహేష్ సినిమా నే తలదన్ని ముందుకు కొనసాగుతుంది.
ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమ సినిమాకి వచ్చే ఒక్కో టికెట్ లో 5 రూపాయలను అయోధ్యకి పంపిస్తామని ప్రేక్షకులకి మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ తరుణంలోనే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు హనుమాన్ టీం. ప్రీమియర్ షోల ద్వారా హనుమాన్ మూవీ టికెట్లపై వచ్చిన ఆదాయంలో రూ.14.25 లక్షలను రామ మందిరానికి విరాళంగా ఇచ్చారు హనుమాన్ టీం.
ఇక ఈ విషయాన్ని స్వయంగా చిత్ర నిర్మాతలు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు థియేటర్లలో సినిమా ఆడినన్ని రోజులు విరాళం ఇస్తూనే ఉంటామని తెలిపారు. ఇక వీరు చెప్పిన మాట నిలబెట్టుకోవడంతో ప్రేక్షకులంతా శభాష్ అంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!