Guntur Kaaram: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈసారి సంక్రాంతి పండుగకు భారీ అంచనాలు మధ్య విడుదలైన సినిమా “గుంటూరు కారం”. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఈ సినిమాకి మొదటి రోజు టాక్ పర్వాలేదు అనిపించింది. సాధారణ ప్రేక్షకులతోపాటు రివ్యూలు కూడా బాగానే వచ్చాయి. అయితే ఈ సినిమా కలెక్షన్ల విషయానికొస్తే అన్ని సెంటర్లలో నుంచి ఓపెనింగ్ రికార్డు స్థాయిలో రాబట్టింది. “గుంటూరు కారం” మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 కోట్లకు పైగాని కలెక్షన్స్ రాబట్టినట్లు ఇండస్ట్రీ టాక్.
ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా “గుంటూరు కారం”.. సినిమాకి వచ్చిన కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో 44.50 కోట్ల రూపాయలు, కర్ణాటక నుండి 4.5 కోట్ల రూపాయలు, తమిళనాడు నుండి 50 లక్షల రూపాయలు, మిగిలిన రాష్ట్రాలలో 50 లక్షల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలు. ఈ కలెక్షన్లకు సంబంధించి సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. “గుంటూరు కారం” థియేటర్ లో రాకముందు.. విడుదలైన పాటలు మరియు పోస్టర్స్, ట్రైలర్, టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి. “కుర్చీ మడతపెట్టి” సాంగ్ యూట్యూబ్ నీ షేక్ చేసి పడేసింది. దీంతో ఊహించని విధంగా ఓపెనింగ్స్ రావడం జరిగాయి. మహేష్ కెరియర్ లోనే “గుంటూరు కారం” అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టడం జరిగింది. “సర్కారు వారి పాట” రిలీజ్ అయిన ఏడాదిన్నర గ్యాప్ తర్వాత సినిమా రావటంతో.. భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.
మహేష్ బాబుకి జంటగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతిబాబు, బ్రహ్మానందం, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు చేయడం జరిగింది. సూర్యదేవరనాగ వంశీ నిర్మాతగా వ్యవహరించారు. దాదాపు 200 కోట్ల రూపాయలతో ఈ సినిమా తెరకెక్కటం జరిగింది. తల్లి కొడుకు సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కింది. మహేష్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించింది. ఈ సినిమాలో మహేష్ బాబు డాన్స్ చాలా హైలెట్ అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటివరకు ఏ సినిమాలో చేయని విధంగా ఈ సినిమాలో..మహేష్ స్టెప్స్ వేసినట్లు తెలపడం జరిగింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!