ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క హీరోయిన్ తమ సమస్యలను బయట పెట్టడానికి ఏమాత్రం ఇబ్బంది పడడం లేదు. ఇటీవలే సమంత సైతం మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్నట్లు బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. అలానే ఇండస్ట్రీలో మరో హీరోయిన్ తన హెల్త్ కండిషన్ ని బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది.
ఇలా వరుసగా హీరోయిన్లు తాము ఎదుర్కొంటున్న సమస్యలను బయటపెడుతున్నారు. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న పూనమ్ గతంలో ఫైబ్రోమయాల్దియా అనే వింత జబ్బుతో బాధపడిందట. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన వ్యాధిపై కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఇది కూడా ఇంచుమించు మయోసైటీస్ లాంటిదే అని వెల్లడించింది. ఇక ఈ వ్యాధికి గురైన బాధితులు తీవ్రమైన నొప్పిని భరించాల్సి ఉంటుందని శరీరం మొత్తం పట్టేసినట్లు బిగించుకుని బ్లడ్ సర్క్యులేట్ కాక చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందని తెలిపింది. అదేవిధంగా టైట్ డ్రస్సులు వేసుకోవడానికి కుదరదని.
అలా వేసుకోవడం ద్వారా మన ప్రాణానికే ప్రమాదమని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఇక ఇందువల్లే కొంతకాలం పాటు బాగా లూస్ గా ఉండే బట్టలనే ధరించినట్లు వెల్లడించింది. ఇక ఫైనల్ గా నేచురోపతి ద్వారా పేరుగాంచిన మంతెన సత్యనారాయణ ను కలిసి తన వ్యాధి నుంచి విముక్తి పొందినట్లు తెలిపింది పూనమ్. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారాయి.