మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కోసం కథ వండుతున్నారు. ఇపటికే ఒక వర్షన్ రెడీ చేసిన త్రివిక్రం ఆర్ ఆర్ ఆర్ ని దృష్ఠిలో పెట్టుకొని స్క్రిప్ట్ ని పాన్ ఇండియా లెవల్ లో మార్పులు చేస్తున్నారట. ఇక ఈ సినిమా ఎన్.టి.ఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా రూపొందుతుండటం విశేషం. అందుకే ఎలాగైనా ఎన్.టి.ఆర్ కి మైల్ స్టోన్ లాంటి సినిమా ఇవ్వాలని త్రివిక్రం స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సిద్దం చేస్తున్నారట.
అయితే కరోనా పరిస్థితుల మూలంగా చిత్ర పరిశ్రమలో చరిత్రలో ఇప్పటి వరకు జరగనన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందుకు కారణం కరోనా తో విధించిన లాక్ డౌన్. వేల కొట్ల రూపాయల నష్టం జరిగింది. వేల మంది సినీ కార్మీకులకి ఉపాది లేకుండా పోయింది. అసలే చిత్ర పరిశ్రమలో కష్టాలు ఎక్కువనుకుంటే ఇప్పుడు కరోనా విసిరిన పంజా కి మొత్తం ఇండస్ట్రీనే కుదేలయిపోయింది. పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ బడాయి పోయో బడా నిర్మాతలకి దిక్కు తోచని పరిస్థితి నెలకొంది.
దాంతో గత కొన్ని రోజులుగా నిర్మాతలు సినిమాకి పనిచేసే దర్శకుల దగ్గర్నుంచి..సినిమాటోగ్రాఫర్స్, హీరో.. హీరోయిన్స్ ..ఇలా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకునే ప్రతీ ఒక్కరికి కోత పడుతుందని చెప్పుకుంటూ వస్తున్నారు. అది మెల్లగా మొదలైందని తాజా సమాచారం. అంతేకాదు ఈ కోత సినిమా బడ్జెట్ లోను పడిందట. ముందుగా త్రివిక్రం శ్రీనివాస్ ఎన్.టి.ఆర్ రెమ్యూనరేషన్స్ తగ్గించారని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు.
అంతేకాదు నిర్మాతలు త్రివిక్రం తోను బడ్జెట్ ముందు అనుకున్న దానికంటే తగ్గించి అందులోనే సినిమాని పూర్తి చేయాలని చెప్పినట్టు సమాచారం. ఇక మేకర్స్ ప్లాన్ కూడా బాగా అప్లై చేసినట్టు అంటున్నారు. ముందు దర్శకుడు, హీరో ని కన్విన్స్ చేస్తే మిగతా వాళ్ళని ఈజీగా ఒప్పించవచ్చన్న ఆలోచన వర్కౌట్ అయిందని అంటున్నారు. ఇందుకు త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కూడా పరిస్థితులని అర్థం చేసుకొని నిర్మాతలకి సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!