గోపీచంద్ తో జిల్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణ. ప్రస్తుతం ప్రభాస్ తో ‘రాధే శ్యామ్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. సాధారణంగా ఈ టైమ్ లో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో లైవ్ చాటింగ్ లు, మెసేజెస్ తో బిజీగా ఉంటారు దర్శకులు. కానీ.. ఆ అవకాశం లేకుండా రాధాకృష్ణకు ఇన్ స్టాగ్రామ్ భారీ ఝలక్ ఇచ్చింది.
దీంతో రాధాకృష్ణకు షాక్ తగిలింది. దీంతో తన ట్విట్టర్ అకౌంట్ లో స్పందించాడు. ‘నేను వేరొకరిలా యాక్ట్ చేస్తున్నాని నా అకౌంట్ డిలీట్ చేసేశారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు’ అని ట్వీట్ చేశాడు. రాధాకృష్ణ అకౌంట్ డమ్మీ అకౌంట్ అనే అనుమానంతో ఈ అకౌంట్ డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. మరి దీనిపై ఇన్ స్టాగ్రామ్ మేనేజ్ మెంట్ రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి, నిజానికి ఈ అకౌంట్ డిలీట్ చేయకముందు చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ రాధాకృష్ణతో చాట్ చేశారు.
సినిమా టైటిల్ కోసం, ప్రభాస్ లుక్ కోసం. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. కేవలం ట్విట్టర్ ద్వారానే అభిప్రాయాలు షేర్ చేసుకోవాలి. మరోవైపు రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ పై భిన్న వాదనలు వస్తున్నాయి. కాపీ కంటెంట్ అంటూ భారీ విమర్శలు వస్తున్నాయి. అయితే.. ప్రభాస్ ఇండియా వైడ్ క్రేజ్ వల్ల లైక్స్ ఎక్కువగా వస్తున్నాయి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!