కొన్ని సినిమాల వేళా విశేషం ఏంటోగానీ, మొదలైనప్పటి నుంచే అవి వార్తల్లో ఉంటాయి. తాజాగా `రాజుగారి గది3` ఉన్నట్టు. ఓంకార్ దర్శకత్వం వహించిన రాజుగారి గది, రాజుగారి గది2కు అందిన విజయం తెలిసిందే. తాజాగా రాజుగారి గది3 చేయాలని ఆయన సంకల్పించారు. ఆమేరకు ఆర్నెళ్ల క్రితం తమన్నాకు కథ వినిపించడం, ఆమె ఓకే చేయడం, ప్రెస్ రిలీజ్ చేయడం అన్నీ వరుసగా జరిగాయి. మరో వారంలో షూటింగ్ ఉందని అనగా ఆమె మళ్లీ కథ విని, తాను మొదలు విన్న కథకూ, ఈ కథకూ సంబంధం లేదని తూచ్ అని కచ్చితంగా చెప్పింది. దాంతో ప్రాజెక్ట్ తాప్సీ చేతికింది టేబుల్కి మూవ్ అయింది. ఇప్పటికే ఊపిరి తీసుకోలేనన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తాప్సీ `సారీ` చెప్పేసింది. అందువల్ల ఇప్పుడు ఓంకార్ కన్ను కాజల్ మీద పడింది. త్వరలోనే ఆమెను కలుసుకుని కథ చెప్పాలని ఆయన నిర్ణయం. కథ విన్నాక కాజల్ ఏమంటుందో చూడాలి. ఒకరు కాదు.. ఏకంగా ఒకరికి ఇద్దరు పొమ్మన్న కథను కాజల్ చేస్తుందో లేదో మరి. ఈ చిత్రంలో అశ్విన్ బాబు, ఊర్వశి, అలీ ఇతర పాత్రల్లో నటిస్తారు. అన్నీ సెట్ అయితే త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!