Adipurush: తిరుపతి వేదికగా “ఆదిపురుష్” ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. బహిరంగ మైదానం కావడంతో లక్షలాది మంది అభిమానులు రావడంతో… సభా ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. ముఖ్యఅతిథిగా వచ్చిన చినజీయర్ స్వామి… రాముడిగా నటించిన ప్రభాస్ నీ అభినందించడం జరిగింది. ఈ సినిమాని తీసిన మేకర్స్ ని కూడా ప్రత్యేకంగా అభినందించారు. సీత పాత్రలో నటించిన హీరోయిన్ కృతి సన్నన్ మాట్లాడుతూ… తన కెరియర్ 9సంవత్సరాలు క్రితం తెలుగులోనే స్టార్ట్ అయిందని తెలియజేయడం జరిగింది. తెలుగు వాళ్ళ ఆశీర్వాదం నన్ను ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చాయి.
“ఆదిపురుష్” నా కెరియర్ లో చాలా స్పెషల్ సినిమా. జానకి నాకు ఎంతో ప్రత్యేకమైన పాత్ర. చాలామంది నటీనటులకు కెరియర్ లో గుర్తుండిపోయే పాత్రలు వస్తాయి. తెలుగు ప్రేక్షకులందరికీ ప్రేమ వలన నాకు ఈ పాత్ర వచ్చింది. కెరియర్ పరంగా నేను ఏ సినిమాను.. సెలెక్ట్ చేసుకోను. వాళ్లే ఆ పాత్రకు నేను సెట్ అవుతాను అంటే నన్ను ఎంచుకుంటారు. కానీ ఈ పాత్ర నాకు రావాలని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. ఆ పాత్ర నాకు వచ్చినందుకు నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు కృతి సన్నన్… తన ఆనందం వ్యక్తం చేయడం జరిగింది.
ఇంకా హీరో ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ లో ప్రభాస్ చాలా కామ్ గా ఉంటారు. కానీ ప్రభాస్ అందరం అనుకున్నంత కామ్ కాదు. చాలా బాగా మాట్లాడుతారు. అందరికీ తెలిసినట్టే అతను బాగా భోజన ప్రియుడు. నిజంగా ప్రభాస్ డార్లింగ్ వెరీ స్వీట్ ఎంతో కష్టపడే తత్వమున్న ఆర్టిస్ట్. ప్రభాస్ లో ఉండే ఒక కామ్ నేస్… ఎవరిలోనూ చూడలేదు. రాముడిగా ప్రభాస్ ను తప్ప మరొకరిని ఊహించుకోలేం….అంటూ కృతి సన్నన్.. “ఆదిపురుష్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పీచ్ ఇవ్వడం జరిగింది.