Malli Nindu Jabili April 23 2024 Episode 630: ఇప్పుడు వాళ్లకు ఎందుకు ఫోన్ చేయాలి అని గౌతమ్ అంటాడు. వాళ్లు ఎంత బాధ పడి ఉంటారు మాలిని అక్కకు ముందు ఫోన్ చేద్దామనుకున్నాను ముందు మీరు అరవింద్ బాబుకి సారీ చెప్పండి ఆ తర్వాత నేను ఫోన్ చేస్తాను అని మల్లి అంటుంది. అరవింద్ నా నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేయడుఅని గౌతమ్ అంటాడు.మీరు చేస్తారా లేదా అని మల్లి అంటుంది. నేను ఏ తప్పు చేయలేదు నేను సారీ ఎందుకు చెప్పాలి అని గౌతమ్ వెళ్తూ ఉండగా కౌసల్య పిలిచి ఎక్కడికి వెళ్తున్నావ్ రా అని అడుగుతుంది.
పనికి వెళుతున్నాను అమ్మ అని గౌతమ్ అంటాడు. టిఫిన్ చేసి వెళ్ళరా అని కౌసల్య అంటుంది. నాకు వద్దమ్మా అంటూ గౌతమ్ వెళ్ళిపోతాడు. వాడు ఎందుకు అలా వెళ్ళిపోయాడు అని కౌసల్య అడుగుతుంది.మల్లి కోపంగా వెళ్ళిపోతుంది. వీళ్ళు రాత్రి జరిగిన దాని గురించి మళ్లీ గొడవపడ్డారా అని ఆలోచిస్తుంది కౌసల్య. కట్ చేస్తే,మాలిని అరవింద్ హాస్పిటల్ కి వెళ్తారు. డాక్టర్ అపార్ట్మెంట్ తీసుకొని డాక్టర్ తో మాట్లాడుతారు. మేము పిల్లల్ని కనడానికి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నాం నా భార్యకి అనుకోని పరిస్థితుల వల్ల అబార్షన్ అయ్యింది
ఒకసారి టెస్ట్ చేసి చెప్పండి అని అరవింద్ అంటాడు. మీరు బయట వెయిట్ చేయండి అని అరవింద్ ని బయటికి పంపిస్తుంది డాక్టర్. మాలిని ని టెస్ట్ చేస్తుంది డాక్టర్ గారు. గౌతమ్ వెళ్తూ ఉండగా దారిలో ఒక బాబు ఏడుస్తూ కనిపిస్తాడు బాబు ఎందుకు ఏడుస్తున్నాడు నేను ఆడించనా అని గౌతమ్ తనని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటాడు.బయట కూర్చున్న అరవింద్ హాస్పటల్లో ఒక పాపని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటాడు. మాలిని ని టెస్ట్ చేసిన డాక్టర్ గారు అరవింద్ ని రమ్మని చెబుతుంది. ఏమైంది డాక్టర్ గారు అని మాలిని అడుగుతుంది. మీ భర్త రానివ్వండి ఇద్దరికి ఒకేసారి చెప్తాను అని డాక్టర్ అంటుంది. చెప్పండి డాక్టర్ మేము పిల్లలు కనడానికి ప్లాన్ చేసుకోవచ్చా అని అరవింద్ అంటాడు. సారీ అండీ మీ భార్య ఈ జన్మలో తల్లి అయ్యే అవకాశం లేదు అని డాక్టర్ చెబుతుంది. అదేంటి డాక్టర్ అలా అంటారు అని అరవింద్ అంటాడు. మీ భార్య కింద పడడంతో గర్భ కోసం బాగా దెబ్బతినింది తను బిడ్డను కానే శక్తిని గర్భసంచి ఇవ్వలేదు మీరు ఎక్కడికి వెళ్లినా ఇదే చెబుతారు అని డాక్టర్ అంటుంది.
నో డాక్టర్ గారు అలా జరగకూడదు నేను బిడ్డను కనాలి అని మాలిని అంటుంది. మీరు కింద ఎందుకు పడ్డారో నాకు తెలియదు కానీ అలా మీరు కింద పడడం వల్ల ఇలా జరిగింది మీరు ఏ హాస్పిటల్ కి వెళ్ళినా ఇదే చెప్తారు అని డాక్టర్ గారు చెబుతారు. గుండె నిండా బాధతో కళ్ళ నిండా నీళ్లతో కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయని నిరాశతో బయటికి వెళ్తారు. కట్ చేస్తే, మాలిని ఇంటికి రావడంతోటే పేపర్లను విసిరేసి పూల కుండీలని కింద పడేసి ఏడుస్తుంది.మాలిని ఏమైంది ఎందుకలాఏడుస్తున్నావ్ అని వసుంధర అంటుంది. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్న మా అత్తయ్య అని అరవింద్ అంటాడు. ఇప్పుడు హాస్పిటల్ కి ఎందుకు వెళ్లారు అరవింద్ అని శరత్ అంటాడు. పిల్లల్ని కనడానికి ప్లాన్ చేసుకుందామని డాక్టర్ని కలవడానికి వెళ్ళాము కానీ మాలిని తల్లి అయ్యే అవకాశం లేదనే డాక్టర్ చెప్పింది అని అరవింద్ జరిగిన విషయం అంతా చెబుతాడు. మామ్ ఈ జన్మ ఇంకెందుకు అమ్మ అని పిలిపించుకోలేని జన్మ అక్కర్లేదు నేను చచ్చిపోతాను బ్రతికి ఉండి మాత్రం లాభమేంటి అని మాలిని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. మాలిని నీ పరిస్థితిని చూసి నేనేమీ చేయలేను కానీ అలాగని ఏడుస్తూ కూర్చుంటావా అని వసుంధర అంటుంది.
మాలిని ఈ హాస్పిటల్ కాకపోతే వేరే హాస్పిటల్ కి వెళ్లి కనుక్కుందాం పిల్లల్ని ఇంకోరకంగా అయినా ప్లాన్ చేసుకోవచ్చు అని శరత్ అంటాడు. ఏ రకంగా మాలిని తల్లి అయ్యే అవకాశం లేదు తన గర్భసంచి కరాబ్ అయిపోయిందంట అని అరవింద్ చెబుతాడు. సారీ అరవింద్ నీ కలల్ని నాశనం చేశాను నీకు పిల్లలు అంటే ఎంతో ఇష్టం నీకు పిల్లల్ని కనివ్వలేకపోతున్నాను అని మాలిని బాధపడుతుంది. అలా అనకుమాలిని భగవంతుడు మనకింతే రాసిపెట్టి ఉందనుకుందం అని అరవింద్ అంటాడు.
మామ్ నేను బయటికి వెళ్లి వస్తాను పనుంది అని మాలిని అంటుంది. ఎక్కడికి మాలిని అని వసుంధర అంటుంది. ఇలా జరగడానికి కారణం మల్లి కాబట్టి మల్లి నీ కలవాలి అని మాలిని వెళ్ళిపోతుంది. అత్తయ్య నేను కూడా బయటికి వెళ్లి వస్తాను అని అరవింద్ అంటాడు.నువ్వెక్కడికి అరవింద్ అని వసుంధర అంటుంది. గౌతమ్ ని కలవాలని అత్తయ్య అని అరవింద్ అంటాడు.తను ఇప్పుడు ఇంటి దగ్గర ఉండడు కదా అని శరత్ అంటాడు. గౌతమ్ ఎక్కడుంటాడో నాకు బాగా తెలుసు అని అరవింద్ వెళ్ళిపోతాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది