Malli Nindu Jabili March 2 2024 Episode 587: ఎంత ఓదారుద్దామని చూస్తే వాళ్ళు ఎంత ఎత్తున ఎగిరి పడుతున్నారు ఇప్పుడే మీ మాట్లాడకు బయటికి వెళ్లిపో అని మీరా అంటుంది. నా హోమం పాడు చేసిన అదేమీ మనసులో పెట్టుకోకుండా అక్కతో మాట్లాడడానికి వచ్చాను అమ్మ అని మల్లి అంటుంది. మల్లి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళిపో అని మీరా బయటికి వెళ్లగొడుతుంది. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి డ్రామా మొదలుపెట్టారు మీ నాన్నని మాయలో పడేసుకున్నట్టు నిన్ను మాయలో పడేద్దాం అనుకుంటున్నారు ఇంక నువ్వు ఆలస్యం చేయకుండా కంప్లీట్ ఇంచి రావడం మంచిది అని వసుంధర అంటుంది. ఇప్పుడే స్టేషన్ కి వెళ్లి ఆ గౌతమ్ పై కంప్లీట్ ఇచ్చి వస్తాను నువ్వు రావద్దు అమ్మ నేనే వెళ్తాను అని మాలిని వెళుతుంది.
ఇప్పుడు ఏం జరిగు0దో ఏమో అని మీరా టెన్షన్ పడుతుంది.. కట్ చేస్తే, గౌతమ్ వాళ్లు కంప్లీట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వస్తారు. కంప్లైంట్ ఏంటో రాసివ్వండి అని ఎస్ఐ అంటాడు. గౌతమ్ ని కూర్చోబెట్టి కోటి కంప్లీట్ రాయమంటాడు. సిఐ గారు నాకు ఈ సిటీలో 10 రైస్ మిల్లులు ఉన్నాయి ప్రాపర్ గా ఉన్న మైసమ్మ గుడి దగ్గర రైస్ మిల్లులో దొంగలు పడ్డారు అని కంప్లీట్ రాయిస్తాడు కోటి. రాసిన కంప్లీట్ ని ఎస్సై కి ఇస్తాడు కోటి. వీలైనంత తొందరగా పట్టుకోండి సార్ అని కోటి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా మాలిని అక్కడికి వస్తుంది. మాలిని నీ చూసి గౌతమ్ ఆగిపోతాడు. సిఐ గారు నా పేరు మాలిని చనిపోయిన జర్నలిస్ట్ అరవింద్ భార్యని అని మాలిని అంటుంది. చెప్పండి అని సీఐ అంటాడు. నా భర్తని చంపింది గౌతమ్ అని కేసు పెట్టడానికి వచ్చాను అని మాలిని అంటుంది. ఆరోజు అరవింద్ బ్రతికున్నాడని నువ్వు మల్లి వెళ్ళారంట కదా మా కానిస్టేబుల్ చెప్పాడు అని ఎస్ఐ అంటాడు.
నా భర్త చనిపోఎ రోజు గౌతమ్ ఫోన్ చేసి రప్పించుకున్నాడు హత్య చేసింది గౌతమ్ వెంటనే మీరు గౌతమ్ ని అరెస్టు చేయాలి అని మాలిని అంటుంది. ఓకే నేను చూసుకుంటాను అని ఎస్ఐ అంటాడు. మాలిని కంప్లీట్ రాసి ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇది నా మెడకు చుట్టుకునేలా ఉంది ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడు గౌతమ్. కట్ చేస్తే, మీరా మల్లి కి ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా అని మల్లి అడుగుతుంది. మల్లి ఇంటికి వెళ్ళావా నువ్వు వెళ్లిపోగానే మాలిని అమ్మగారు గౌతమ్ మీద కేసు పెట్టడానికి వెళ్లారు ఈపాటికి కేసు పెట్టే ఉంటుంది మల్లి నేను ఒక మాట చెప్తాను వింటావా మనం ఈ ఊర్లోనే ఉంటే మన అందరిని ఇబ్బంది పెట్టాలని నిత్యం అదే ధ్యాసలోనే ఉంటుంది వసుంధరమ్మ గౌతమ్ వాళ్ళని తీసుకొని మనం నేలకొండపల్లికి వెళ్ళిపోదాం అమ్మ అని మీరా అంటుంది. సమస్యలకి భయపడి పారిపోతామా అని మల్లి అంటుంది. ఒకసారి ఆలోచించమ్మా అని మీరా అంటుంది. పారిపోయే పరిస్థితి కాదమ్మా ఇది పోరాడే సమయం అని మల్లి అంటుంది.
మాలిని జీవితం అట అయిపోయింది నీవేమో ఇన్ని కష్టాలు పడుతున్నావ్ అని మీరా బాధపడుతుంది. నేను మాలిని అక్క తో మాట్లాడుతాను నువ్వేమీ టెన్షన్ పడకు అని మల్లి అంటుంది. మాలిని అక్క స్టేషన్ కి వెళ్ళిందంటే ఇంకా ఇంటికి వెళ్ళలేదు పక్కదారి ఉండనే వెళ్తుంది అని మల్లి ఆటో తీసుకువెళ్లి మాలిని గార్ కి అడ్డం పెట్టిస్తుంది. కట్ చేస్తే, గౌతమ్ మీద కేసు పెట్టడానికి వెళ్ళావా అని మల్లి అడుగుతుంది. మీరానే గూడచారి ఉంది కదా ఆవిడ వల్ల తెలిసిందా అని మాలిని అంటుంది. అవును కేసు పెట్టాను ఇన్ని రోజులకు కేసు పెట్టడం సక్సెస్ఫుల్గా జరిగింది ఇక ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది ఆధారాలు దొరుకుతాయి సాక్షి చెప్పే సాక్ష్యం బలం అవుతుంది ఫైనల్ గా జైల్ శిక్ష ఉరి అని మాలిని అంటుంది.
ఆయన చంపలేదని సీతారాముల మీద ఒట్టేసిచెబుతున్నా అక్క కేసు వాపస్ తీసుకో అని మల్లి అంటుంది. గౌతమ్ తప్పు చేయకపోతే ఎందుకు సైలెంట్ గా ఉంటాడు నామీదకి రివర్స్ అయ్యేవాడు కదా నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నా మీద ఎదురు తిరిగి కేసు పెట్టేవాడు కదా అని ఒక న్యూస్ ఛానల్ ని రన్ చేసిన వాడికి ఆమాత్రం తెలియలేడ సైలెంట్ గా ఉన్నాడు అంటే నేరం చేశాడని అర్థం అని మాలిని అంటుంది. ఆయన నిజంగా తప్పు చేయలేదక్కా అని మల్లి అంటుంది.నువ్వు కన్నీళ్లు పెట్టుకున్న కాళ్లు పట్టుకున్న గౌతమ్ ని వదిలిపెట్టను అంటూ మాలిని వెళ్ళిపోతుంది.కట్ చేస్తే, గౌతమ్ ఇంటికి వస్తాడు. రెండుసార్లు ఫోన్ చేశాను ఎత్తలేదు ఎందుకండి అని మల్లి అడుగుతుంది. మల్లి కి మాలిని కేసు పెట్టిందని చెప్తే వెంటనే అక్కడికి వెళుతుంది చెప్పొద్దు అని గౌతమ్ ఆలోచిస్తాడు.
ఎందుకండీ ఎలా ఉన్నారు అని మల్లి అడుగుతుంది. ఆఫీసులో వర్క్ ఎక్కువైంది అని గౌతమ్ అంటాడు. మంచినీళ్లు తీసుకొస్తాను అని మల్లి వెళ్లి మంచినీళ్లు తెచ్చి ఇస్తుంది. గౌతమ్ కి జండుబాం రుద్దుతుంది మల్లి . ఏమండీ నేను మిమ్మల్ని ఒక మాట అడగనా అని మల్లి అంటుంది.ఏంటి అని గౌతమ్ అంటాడు. నేను మీ జీవితంలోకి వచ్చిన కానుంచి ఇలా జరుగుతుందని అత్తయ్య అంటుంది మీరు కూడా అదే నమ్ముతున్నారా అని మల్లి అంటుంది. నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను మధ్యలో ఇవన్నీ పోయాయి దానికి నేను తప్పు పట్టడం లేదు కానీ మాలిని వాళ్ళ ఇంటికి ఇప్పటికి వెళుతున్న అదే నాకు బాధ కలిగిస్తుంది అని గౌతమ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!