Ram Charan : మంచు విష్ణు నటించిన మోసగాళ్లు సినిమాకి సంబంధించి కార్యక్రమంలో ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మోసగాళ్లు సినిమా విశేషాలు పంచుకోవడం జరిగింది. హీరోగా అదేవిధంగా నిర్మాతగా మంచు విష్ణు ఈ సినిమాకి వ్యవహరించడంతో అనేక విషయాలు తెలిపారు. పరిస్థితి ఇలా ఉండగా తాజాగా జాతీయ అవార్డులు కేంద్రం ప్రకటించిన క్రమంలో మంచు విష్ణు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
రామ్ చరణ్ నటించిన “రంగస్థలం” సినిమా కి జాతీయ అవార్డు రాకపోవటం దురదృష్టకరమని, తనకి ఎంతగానో కోపం తేప్పించటం జరిగిందని అన్నారు. అంతేకాకుండా నటుడిగా రంగస్థలం అనేది నటుడికి ఒక ఎక్స్ట్రార్డినరీ ఛాన్స్, అటువంటి క్యారెక్టర్ చేయటం అనేది మామూలు విషయం కాదు, యాక్షన్ సన్నివేశాలు చాలా బాగుంటాయి. కామెడీ అనేది ఎవరైనా చేసేయొచ్చు కానీ రంగస్థలంలో చరణ్ చేసిన క్యారెక్టర్ అత్యద్భుతం .. అటువంటి పాత్రకి జాతీయ అవార్డు ప్రకటించకపోవడంపై నాకు ఎంతగానో కోపం తెప్పించింది అంటూ తన మనసులో మాటను బయట పెట్టాడు మంచు విష్ణు.
ఇదిలా ఉంటే మహర్షి, జెర్సీ అదేవిధంగా శ్రీకారం వంటి తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు రావడం జరిగాయి. దీంతో మహేష్ బాబు అభిమానులు అదే విధంగా న్యాచురల్ స్టార్ నాని అభిమానులు తమ అభిమాన హీరోల సినిమాలకు నేషనల్ అవార్డులు రావటంతో వాల్ ఎంతగానో సంతోషిస్తున్నారు. ఇదిలా ఉంటే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మహేష్ నటించిన మహర్షి సినిమాని చూడటం జరిగిందని.. రైతాంగం పై అద్భుతమైన కథతో చేయటం బాగుంది అంటూ ప్రశంసించారు. అదేవిధంగా శ్రీకారం సినిమాపై కూడా పొగడ్తల వర్షం కురిపించారు.