Chiranjeevi Maruthi: గోపీచంద్ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన “పక్కా కమర్షియల్” ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరగడం తెలిసిందే. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి ఇచ్చిన స్పీచ్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గోపీచంద్ వాళ్ళ నాన్నగారు కాలేజ్ చదువుతున్న సమయంలో తనకి సీనియర్ అని చిరంజీవి కొత్త విషయాన్ని తెలియజేశారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఇదే సమయంలో రావు రమేష్ నటన గురించి ఇంకా బాల నాన్నగారు దివంగత రావు గోపాల్ రావు గురించి అనేక విషయాల్లో మాట్లాడటం జరిగింది. దర్శకుడు మారుతి గురించి మాట్లాడుతూ ఆయన సినిమాలు చూస్తూ ఉంటాను. చాలా ఎంటర్ టైన్ మెంట్ తరహాలో.. సెంటిమెంట్ జోడించి అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు..అంటూ.. మారుతి తీసిన కొన్ని సినిమాల ప్రస్తావన చిరంజీవి చేయడం జరిగింది. ఆ సమయంలో త్వరలో మారుతీ కథ రెడీ చేస్తే సినిమా చేస్తానని.. చిరంజీవి స్టేజి పైనే ఆఫర్ ఇవ్వటం సంచలనం రేపింది.
అయితే చిరంజీవి ఆఫర్ వ్యాఖ్యలపై డైరెక్టర్ మారుతి తాజాగా రియాక్ట్ అయ్యారు. చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తి తనతో సినిమా చేస్తానని చెప్పడం.. కొత్త ఉత్సాహాన్ని గొప్ప ఎనర్జీ ఇచ్చినట్లు ఉందని తెలిపారు. ఆయన మాటలు తనలాంటి దర్శకులకు ఎంతో ఎంకరేజ్మెంట్ మరియు స్ఫూర్తినిచ్చాయి. నా బలం ఏమిటి..? ఆయన ఎలా చూపిస్తే బాగుంటుంది అనే దానిపై నాకంటూ ఒక క్లారిటీ ఉంది. డైరెక్టర్ గా కాకుండా ఒక ప్రేక్షకుడిగా ఆలోచిస్తాను చిరంజీవి సినిమా ప్రాజెక్టు గురించి అంటూ తనదైన శైలిలో మారుతీ రియాక్ట్ అయ్యారు.