SDT 15: మెగా కుటుంబంలో సుప్రీమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్ నుండి వరుసపెట్టి సినిమాలు చేస్తూ రావటం జరిగింది. ప్రారంభంలో కొన్ని పరాజయాలు ఎదురైనా కానీ ఆ తర్వాత వరుస విజయాలతో.. ప్రయోగాత్మక సినిమాలతో సాయి ధరంతేజ్ రాణించడం జరిగింది. మాస్, క్లాస్ ఆడియన్స్ లను అలరించే రీతిలో అన్నిరకాల సబ్జెక్ట్ సినిమాలను చేయటం తెలిసిందే.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే కొద్ది నెలల క్రితం సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కి గురి కావడం తెలిసిందే. యాక్సిడెంట్ కారణంగా చాలా కాలం విశ్రాంతి తీసుకోవటం జరిగింది. అయితే ఇప్పుడు సాయి ధరంతేజ్ కెరియర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో రంగంలోకి దిగుతున్నారు. పూర్తిగా ఆరోగ్యపరంగా కోలుకోవడంతో.. తన కెరియర్ లో 15వ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అయ్యాడు. ఈ క్రమంలో డైరెక్టర్ సుకుమార్ దగ్గర శిష్యత్వం చేసిన కార్తీక్ దండు దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 30 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. బిఎస్ఎన్ఎన్ ప్రసాద్.. మరియు సుకుమార్ సంయుక్తంగా కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో.. సాయిధరమ్ తేజ్ సరసన హీరోయిన్ పాత్రలో సంయుక్త మీనాన్ నటిస్తోంది. “బీమ్లా నాయక్” సినిమాతో పరిచయమైన సంయుక్తమైన.. మధ్యలో “బింబిసర” లో నటించింది ఇప్పుడు మూడో సినిమా.. సాయి ధరమ్ తేజ్ తో చేస్తోంది. ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ గా “SDT 15” పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో చేయబోయే మల్టీస్టారర్ సినిమాకి సంబంధించి షూటింగ్ లో కూడా సాయి ధరంతేజ్ జాయిన్ కానున్నట్లు టాక్. పవన్ కళ్యాణ్ తో చేయబోయే మల్టీస్టారర్ సినిమా కేవలం రెండు నెలల్లోనే కంప్లీట్ చేసి తరహాలో ఆ సినిమా యూనిట్ రెడీ అయినట్టు ఇండస్ట్రీ వర్గాల లేటెస్ట్ టాక్ నడుస్తోంది.