కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించడానికి ఆసక్తి చూపించి `అ!` చిత్రంతో నిర్మాతగా మారాడు హీరో నాని. వాల్ పోస్టర్ బ్యానర్పై విడుదలైన అ! మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు నాని మరోసారి నిర్మాతగా మారుతున్నాడు. ఈ సినిమాలో `ఈనగరానికిఏమైంది`, `ఫలక్నుమాదాస్` చిత్రాల్లో నటించిన హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా కనిపిస్తాడట. `ఫలక్నుమాదాస్` ప్రీ రిలీజ్ ఈవెంట్కు అతిథిగా వచ్చిన నాని ఈ విషయాన్ని చెప్పాడు. ప్రస్తుతం నాని హీరోగా `నాని గ్యాంగ్ లీడర్`, `వి` చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రాలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత నాని నిర్మాతగా విశ్వక్సేన్తో సినిమా చేస్తాడు.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!