Nayanthara: టాలీవుడ్ డే కాదు అన్ని ఇండస్ట్రీలు నావే అంటూ దూసుకుపోతున్న నయనతార ప్రస్తుతం కొంచెం స్లో అయింది. కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ తనేంటో ప్రూవ్ చేసుకుంది నయన్. ఇక ఇటీవలే జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా నయంతారా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం ఉన్న సినీ ఇండస్ట్రీలో ప్రేమ మరియు పెళ్లి వంటివి చాలా కామన్ అయిపోయాయి.
పెళ్లయిన ఒక ఏడాదికే విడాకులు తీసుకుంటూ తమ అభిమానులకి షాక్ ఇస్తున్నారు సినీ సెలబ్రిటీలు. ఈ కోవా కి చెందిన వారే నిహారిక మరియు సమంత కూడా. తాము తమ భర్తకి విడాకులు ఇచ్చే కంటే ముందే కొన్ని హింట్స్ ఇస్తూ విడాకులు తీసుకున్నారు. ఆ హింట్స్ మరేవో కాదు సోషల్ మీడియా ఖాతాలలో తమ ప్రియుడి ఎకౌంట్లో అన్ ఫాలో కొడుతూ.. ఫోటోలను డిలీట్ చేయడం వంటివి చేశారు. దీంతో ప్రతి ఒక్కరు వీరు విడాకులు తీసుకుంటున్నారు అని అర్థం చేసుకునేవారు.
ఇక తాజాగా నయనతార కూడా ఇదే పని చేసింది. దీంతో ప్రేక్షకులు మొత్తం షాక్ అవుతున్నారు. హీరోయిన్ నయనతార కు ఇన్స్టాలో 78 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఇక తాజాగా నయనతార తన భర్త విగ్నేష్ శివన్ను ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసింది. దీంతో ప్రతి ఒక్కరికి అనుమానాలు వ్యక్తమయ్యాయి. అదేవిధంగా ఇన్స్టా ఐడి ని కూడా నయనతార అని రాసుకోవడంతో ప్రతి ఒక్కరు వీరిద్దరూ కూడా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఫిక్స్ అయిపోయారు.
దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ఇప్పుడు ఇలా చేయడంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఇక వీరికి ఇటీవలే ఇద్దరు కవల పిల్లలు కూడా జన్మించిన సంగతి తెలిసిందే. వారి ఫోటోలను షేర్ చేస్తూనే వీరిద్దరూ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరిద్దరూ 2022లో పెద్దల అంగీకారంతో ఒకటయ్యారు. ఇక ఒక్కసారిగా నయనతార తన హస్బెండ్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని అన్ ఫాలో కొట్టడంతో ప్రతి ఒక్కరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా.. నువ్వు కూడా సమంత మరియు నిహారిక బాటలో నడుస్తున్నావా.. అంటూ ఫైర్ అవుతున్నారు.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?