బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ చనిపోయినప్పటి నుంచి ఆ ఇండస్ట్రీలో ఖాన్ల త్రయానికి సెగ మొదలైంది. ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం వల్లే సుశాంత్ చనిపోయాడని అతని ఫ్యాన్స్ ఇప్పటికీ ఆ ఇండస్ట్రీలోని పలువురిపై ఫైర్ అవుతున్నారు. అయితే ఆ ఖాన్ త్రయంలో ఒకడైన సల్మాన్ను మాత్రం నెటిజన్లు ఇంకా విడిచిపెట్టడం లేదు. అతను సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెట్టగానే నెటిజన్లు అతన్ని ట్రోల్ చేసే పనిలో నిమగ్నమవుతున్నారు. ఈ క్రమంలోనే సల్మాన్ తాజాగా మరొక ఫొటోను తన సోషల్ ఖాతాలో పోస్ట్ చేయగా.. దానికి కూడా నెటిజన్లు మండిపడుతున్నారు.
కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెబుతూ సల్మాన్ ఒ ఫోటోను తన ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశాడు. అందులో సల్మాన్ సైకిల్ రైడ్ చేస్తూ మాస్క్ ధరించి ఉన్నాడు. అయితే ఈ ఫొటో పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. అతన్ని ట్రోల్ చేస్తున్నారు. స్టే సేఫ్.. సల్మాన్ భాయ్.. ఇప్పుడు సైకిల్తో శరీరాలను తొక్కించుకుంటూ వెళ్లేందుకు వస్తున్నాడు.. అని ఒక యూజర్ ఆ ఫొటోకు కామెంట్ పెట్టాడు. ఇక మరొక యూజర్.. సల్మాన్ నుంచి దూరంగా ఉండాలని.. అన్నాడు. అలాగే ఇంకో యూజర్… మొదట కార్, తరువాత ట్రాక్టర్, ఇప్పుడు సైకిల్, ఇంకా ఎంత మందిని యాక్సిడెంట్ చేస్తాడు ? అని ప్రశ్నించాడు.
https://www.instagram.com/p/CE7DfoQFrGe/?utm_source=ig_embed
నీ వల్ల ఎవరూ సేఫ్గా లేరని సల్మాన్ను ఉద్దేశించి మరో యూజర్ కామెంట్ చేయగా.. ప్లీజ్, మీరు ఫుట్పాత్పై వాహనం నడపకండి.. అని మరొక యూజర్ కామెంట్ చేశాడు. కాగా 2002లో ఫుట్పాత్పై నిద్రిస్తున్న కొందరిని తన కారుతో తొక్కించుకుంటూ వెళ్లాడన్న ఆరోపణల నేపథ్యంలో అప్పట్లో సల్మాన్పై కేసు నమోదైంది. కానీ సరైన సాక్ష్యాలు లేని కారణంగా సల్మాన్ నిర్దోషిగా బయటపడ్డాడు. ఈ క్రమంలో నెటిజన్లు అదే సంఘటనను ఉద్దేశించి ప్రస్తుతం కామెంట్లు చేస్తుండడం విశేషం. ఇక బాలీవుడ్లో అంత జరుగుతుంటే సల్మాన్ ఎందుకు నోరు విప్పడం లేదని, ఓ వైపు ముంబైలో కంగనా ఆఫీస్ను కూల్చివేస్తే దానిపై నోరు ఎందుకు విప్పడం లేదని.. కూడా నెటిజన్లు సల్మాన్ను ప్రశ్నిస్తున్నారు.