ఆలీ హీరోగా పెదరావురు ఫిలిం సిటీ పతాకం సమర్పణలో వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ బ్యానర్పై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన జంధ్యాల మార్క్ కామెడీ సినిమా `పండు గాడి ఫోటో స్టూడియో`. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్ర టీజర్ను సుకుమార్ ఇటీవల హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో ఆలీ, నిర్మాత గుదిబండి వెంకట సాంబి రెడ్డి, దర్శకుడు దిలీప్ రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
సుకుమార్ మాట్లాడుతూ `నేను ఆలీ గారికి పెద్ద ఫ్యాన్ని. ఆయన చేసే కామెడీని చాలామంది దర్శకులు ఇష్టపడతారు. ఆలీగారు ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఒక స్టార్ హీరోలా ఆలీ గారిని దర్శకుడు ఈ చిత్రంలో చూపించారు. రెండు సవంత్సరాలు కథ తయారు చేసుకుని ,అనంతరం దర్శకుడు దిలీప్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే నిర్మాత సాంబిరెడ్డి గారికి 22 విద్యాలయాలు వున్నాయి. చక్కటి అభిరుచితో ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో పాటలు చాలా బాగున్నాయి. జంధ్యాల మార్కు కామెడీతో ఈ సినిమా అందరిని అలరించనుంది` అని అన్నారు.
చిత్ర దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ `మా చిత్ర టీజర్ విడుదల చేసిన సుకుమార్గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు జంధ్యాలగారిఫోటోకి నమస్కరించి ఈ సినిమా ప్రారంభించాం. ఈ చిత్రంలో మా హీరో ఆలీ ఎవరికి ఫోటో తీస్తే వారికి పెళ్లి అయ్యి పోతుంది. ఈ చిత్రంలో పాత్రలు విలక్షణంగా, నటీనటుల పేర్లు వైవిధ్యంగా ఉంటాయి.ప్రేక్షకులను కడుపుబ్బా నవించడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.ఆలాగే నూతన నటుడు సందీప్ రాజా, టీనా చౌదరి ఈ చిత్రం లో విలక్షణ పాత్రలు పోషించారు..అలాగే సంగీత దర్శకుడు యాజమాన్య సారథ్యంలో శ్రేయగోషల్,మనీషా చక్కని పాటలు పాడారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్ర ఫ్రీ రిలీజ్ వేడుకను తెనాలి లో ఈనెల 21 న నిర్వహించనున్నాం` అన్నారు.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!