మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకి కొద్ది నెలలపాటు ఖాళీగా ఉన్న స్టార్ హీరోలు ఇప్పుడిప్పుడే షూటింగులకు రెడీ అవుతున్నారు. ఈ విషయంలో అందరికంటే ముందున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. లాక్ డౌన్ ప్రకటించే సమయానికి జార్జియాలో షూటింగ్ లో ఉన్నారు ప్రభాస్. విషయం తెలియగానే వెంటనే ఇండియాకి రిటన్ అయి క్వారంటైన్ అయ్యారు. దీంతో అప్పుడు ఆపు చేసిన “రాధే శ్యామ్” షూటింగ్ ని పూర్తి చేయడానికి ప్రభాస్ రెడీ అయ్యారు. అందుకోసం ఈనెల చివరిలో ఇటలీకి బయలుదేరడానికి ప్రభాస్ రెడీ అయ్యారు.
అక్టోబర్ నుండి ఇటలీలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. జరగబోయే షెడ్యూల్లో ప్రభాస్ తో పాటు పూజా హెగ్డే కూడా పాల్గొనబోతున్నారు. ఇటలీలో ప్రభాస్ పూజ హెగ్డే లపై కీలకమైన సన్నివేశాలను ఈ సినిమా యూనిట్ చిత్రీకరించనున్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్ తర్వాత ఇటలీకి కొత్త పెళ్లి కొడుకు మిషిన్ ఫ్లైట్ ఎక్కనున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కబోయే “రంగ్ దే” షూటింగ్ కోసం ఇటలీ వెళ్ళనున్నారట.
ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఇప్పటికే ఇటలీలో అనేక ప్రాంతాలను ప్రభాస్ చుట్టడంతో… నితిన్ తన కొత్త సినిమా కోసం ప్రభాస్ ని సలహా అడిగినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే కరోనా వైరస్ తర్వాత ఆ దేశంలో ఏటువంటి జాగ్రత్తలు పాటించాలి వంటివాటిపై ముందుగానే ప్రభాస్ సలహాని నితిన్ తీసుకున్నట్లు సమాచారం. లాక్ డౌన్ ముందు తర్వాత ఇటలీలో పరిస్థితులు మారటంతో… అంతకు ముందునుండే ఇటలీలో ప్రభాస్ షూటింగ్ చేస్తున్న తరుణంలో నితిన్ తన కొత్త సినిమా కోసం కరోనా రూల్స్ విషయంలో హెల్ప్ అడిగినట్లు సమాచారం.