నటి పాయల్ గోష్ ఈ మధ్యన ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కష్యప్ పై పాయల్ చేసిన లైంఘిక ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో పాయల్ గోష్ అనురాగ్ కష్యప్ నిజస్వరూపం అంటూ తనకు జరిగిన అవమానాల గురించి మీడియాకు తెలిపింది.
కాని ప్రముఖ డైరెక్టర్ అయిన అనురాగ్ కష్యప్ గురించి ఇలాంటి వార్తలు వినిపిస్తాయని ఎవరూ అనుకోలేదు. కాని నటి పాయల్ గోష్ మాత్రం అతనిపై లైంఘిక ఆరోపణలు చేసింది. తనతో అసభ్యంగా కష్యప్ ప్రవర్తించాడని ఆమె తెలుపుకొచ్చారు. తాజాగా వారిద్దరి మధ్యన జరిగిన మరో ఘటనను కూడా పాయల్ తెలిపారు.
ఎన్టీఆర్ నిన్ను వాడుకోలేదా అని కష్యప్ సూటిగా అడిగారని నటి పాయల్ గోష్ చెప్పారు. దీంతో ఎన్టీఆర్ గురించి ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డైరెక్టర్ అనురాగ్ కష్యప్ పాయల్ తో ఎన్టీఆర్ నిన్ను ఉపయోగించుకున్నాడని, నిన్ను నువ్వు మంచిదానిలా అనుకుంటే సరిపోతుందా అని చాలా నీచంగా మాట్లాడాడని పాయల్ వెళ్లడించారు.
కాగా సినిమా అవకాశాలు కల్పిస్తానని నమ్మించి తన ఇంటికి తీసుకెళ్లి అనురాగ్ పాయల్ ను లైంఘికంగా వేధించాడని పాయల్ ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆమె ప్రధాని దఈష్టికి కూడా తీసుకెళ్లి సంచలనం అయ్యారు. కాగా ఎన్టీఆర్ గురించి కష్యప్ చేసిన ఆరోపణలను ఆమె మీడియాకు తెలిపారు. ఎన్టీఆర్ తనకు మంచి స్నేహితుడని, చాలా మంచి వ్యక్తి అని తెలిపారు. దీంతో పాయల్ మళ్లీ సోషలో మీడియాలో హాట్ టాపిగ్ మారారు.