దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులకు సుపరిచితుడైన విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్. ఈయన ఇప్పుడు కోర్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకెళ్తే.. ప్రకాష్ రాజ్ తను దర్శత్వం చేస్తూ నటించిన చిత్రం ‘ఉలవచారు బిర్యానీ’ని హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు. ‘తడ్కా’ పేరుతో బాలీవుడ్ రీమేక్ ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. అయితే సినిమాలోని ఇతర నిర్మాణ భాగస్వామ్యులు వెసల్ విజన్, జీ గ్రూప్తో ఆర్థిక పరమైన సమస్యలు వచ్చాయి. దీంతో ‘తడ్కా’ విడుదల ఆగిపోయింది. అంతే కాకుండా.. భాగస్వామ్యులకు చెల్లించాల్సిన మొత్తం చెల్లింపుల్లో జాప్యం చేశాడు ప్రకాశ్రాజ్. దీంతో సదరు సంస్థలు కోర్టుని ఆశ్రయించాయి. అయితే పరిస్థితి చేయిదాటకముందే ప్రకాశ్రాజ్ రెండుకోట్ల రూపాయల చెక్కును ఇవ్వడమే కాకుండా.. తన ఆస్థి పత్రాలను ఇవ్వడంతో నిర్మాణ సంస్థలు ప్రకాశ్రాజ్కి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సమయాన్ని ఇచ్చారు. అయితే ప్రకాశ్రాజ్ ఇచ్చిన రూ.2 కోట్ల చెక్ బౌన్స్ కాకూడదని కండీషన్ పెట్టారు.
previous post
next post
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?