న్యూఢిల్లీః బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్ ఘాట్లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జైట్లీ కుమారుడు రోహన్ తండ్రి చితికి నిప్పంటించారు. ఓవైపు భారీ వర్షం కురుస్తుండగా, మరోవైపు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై జైట్లీ దహనసంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు అరుణ్ జైట్లీ అంతిమ యాత్ర కొనసాగింది. జైట్లీ పార్థీవ దేహాన్ని 1.30 గంటల వరకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంచి అనంతరం అంతిమ యాత్ర ప్రారంభించారు. జైట్లీ కడసారి చూపుకోసం పార్టీ నాయకులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు అమిత్షా, రాజ్నాథ్సింగ్, పలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు, అభిమానులు హాజరై జైట్లీకి తుది వీడ్కోలు పలికారు. ప్రముఖ నేతలంతా అంత్యక్రియలు పూర్తయ్యేవరకు నిగంబోధ్ ఘాట్లోనే ఉన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ప్రధాని మోదీ జైట్లీ అంత్యక్రియలకు రాలేకపోయారు.
previous post
next post