(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
బహ్రెయిన్ రాజధాని మనామాలో అతి పురాతనమైన శ్రీకృష్ణ దేవాలయాన్ని పునరుద్ధరించనున్నారు. సుమారు 200 ఏళ్ళ నాటి కృష్ణుడి ఆలయాన్ని 4. 2 మిలియన్ యుఎస్ డాలర్ల వ్యయంతో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ప్రధాని మోదీ ఈ ఆలయాన్ని సందర్శించి.. రీ-డెవలప్ మెంట్ ప్రాజెక్టును ప్రారంభించారు. దాదాపు 16, 500 చదరపు అడుగుల స్థలంలో… 30 మీటర్ల ఎత్తున.. నాలుగు అంతస్థులతో ఈ ఆలయం రూపు దిద్దుకోనుంది. ఈ ఆలయాన్ని సందర్శించిన తొలి భాతర ప్రధాని మోదీనే కావడం విశేషం.
మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఈ గల్ఫ్ దేశాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఆయనకు యుఎఈ ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన ‘ ఆర్డర్ ఆఫ్ జాయేద్’ ని ఇచ్చి సత్కరించింది. భారత-బహ్రయిన్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మరింత అభివృధ్ది పరచేందుకు మోదీ అక్కడి ప్రభుత్వంతో విస్తృత చర్చలు జరిపారు. రూపే కార్డును, మహాత్మా గాంధీ స్మారక తపాలా బిళ్లలను ఆయన విడుదల చేశారు.
Spent time at Bahrain’s Shreenathji Temple. This is among the oldest temples in the region and manifests the strong ties between India and Bahrain.
Here are some blessed moments from the temple. pic.twitter.com/InRdOl65Nv
— Narendra Modi (@narendramodi) August 25, 2019